రామప్ప ఆలయానికి దక్కిన ప్రపంచ వారసత్వ హోదా


అద్భుత శిల్పకళకు చారిత్రక ప్రసిద్ది గాంచిన రామప్ప ఆలయానికి ఖండాంతర ఖ్యాతి లభించింది. సుదీర్ఘ కాలంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసిన కృషి ఫలితంగా రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. 12 వ శథాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. 

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 

కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం అన్నారు. 

కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుకోసం మద్దతు తెలిపిన  యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కృషిచేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సిఎం అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు