మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా పైడి అటవీప్రాంతలో శుక్రవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి . ఈ ఎదురుకాల్పుల్లో 14 మంది నక్సల్స్ హతమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చు. అడవుల్లో కాసన్సూర్ దళానికి చెందిన మావోయిస్టులు పొగాకు ఒప్పందం గురించి సమీప గ్రామ ప్రజలతో మీటింగ్ ఏర్పాటుచేసినట్టు పోలీసులకు సమాచారం అందగా సీ-60 కమాండో బలగాలు అక్కడ మాటు వేశాయి.
గ్రామ ప్రజలను కలిసేందుకు వచ్చిన నక్సల్స్ను కమాండోలు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 14 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఆపరేషన్ విజయవంతమైందని, మరింత ఎక్కువ మంది నక్సల్స్ హతమై ఉంటారని గడ్చిరోలీ డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కమాండోలు స్వాధీనం చేసుకున్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box