పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదలకు ముందే భారి అంచనాలకు చేరింది. సోమవారం చిత్ర యూనిట్ వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల చేసింది. కోర్టులో వాదించడం తెల్సు...కోటు తీసి కొట్టడమూ తెల్సు అన్న డైలాగులతో పవన్ అభిమానుల ఈలలే ఈలలు. ఏప్రిల్ 9 వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్ హైదరాబాద్ లో పలు థియేటర్లలో ప్రదర్శించారు. బాలివుడ్ లో సక్సెస్ అయిన పింక్ చిత్రానికి రీ మేక్ గా రూపొందించిన ఈ చిత్రం కథలో చాలా మార్పులు చేశారు.
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటించారు.
అంత మంచిగనే ఉన్నది కాని ఈ టికెట్ల లొల్లి ఏందట
వకీల్ సాబ్ సినిమా విడుదలకాకముందే టికెట్ల లొల్లి మొదలైంది. సాధారణ టికెట్ ధర రూ 300 నుంచి 500 రూపాయలకు పెంచేందుక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో బెనిఫిట్ షోలకు టికెట్ ధర రూ 1500 లుగా నిర్ణయించారు. సినిమా విడుదలకు ముందే అర్ద రాత్రి, తెల్లవారు జామున ఈ బెనిఫిట్ షోలు ప్లాన్ చేసారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box