పదో తరగతి పరీక్షపేపర్ వాట్సాఫ్ గ్రూపుల్లో సర్కులేట్ చేసిన నిందితుల అరెస్ట్


 పదో తరగతి పరీక్షపేపర్ సర్కులేట్ చేసిన ఇద్దరు నిందితులను వరంగల్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసారు. పథకం ప్రకారం పేపర్ సర్కులేట్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.ఈ కేసులో ఓ మైనర్ బాలుడితో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్  చేసారు.

పరీక్షపత్రం సెల్ ఫోన్లో  చిత్రీకరించి  సర్కులేట్  చేసినట్లు గుర్తించారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లలోకి ఎంటర్ అయిన అనంతరం సర్కులేట్ అయిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ప్రశ్న పత్రం  కాపీ చేసి సర్కులేట్ చేసిన  వ్యవహారం వివరాలను వరంగల్ పోలీస్ కమీషనర్ ఏ.వి రంగనాధ్ మంగళవారం రాత్రి మీడియాకు వివరించారు. 

మైనర్ బాలుడితో పాటు మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి మూడు సెల్ఫో న్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ఒక మైనర్ బాలుడితో  మౌటం శివ గణేష్ వయస్సు 18 సం. కమలాపూర్ గ్రామం, హనుమకొండ మండలం, బూరమ్ ప్రశాంత్ మాజీ విలేకరి, ఆరెపల్లి, హసన్పర్తి మండలం, హనుమకొండ జిల్లాకు చెందిన వారిగా గుర్తించడం జరిగిందని కమీషనర్ తెలిపారు.

నిందితుల్లో ఒకడైన మైనర్ నిందితుడు ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష వ్రాస్తున్న తన మిత్రుడికి పరీక్షలో సహయం చేసేందుకు  పదవ తరగతి హింది పరీక్ష జరుగుతున్న సమయంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ బాలుర పాఠశాల వెనుక భాగంలోని ప్రహరీ ప్రక్కనే వున్న చెట్టు ద్వారా  ప్రహరీ గోడ ఎక్కి  పాఠశాల మొదటి అంతస్తులోని మూడవ నంబర్ గదికి సంబంధించి ప్రహరీ గోడ ప్రక్కనే వున్న కిటికి ప్రక్కనే పరీక్ష వ్రాస్తున్న బాలుడి నుండి  ఉదయం 9.45 నిమిషాలకు హింది పరీక్ష పత్రాన్ని తీసుకోని దానిని తన సెల్ఫోన్ లో చిత్రించాడు.

అనంతరం నిందితుడు తన సెల్ఫోన్లోని హిందీ ప్రశ్నపత్రం  ను మరో నిందితుడైన మౌటం శివ గణేషు వాటప్స్ నంబర్ కు పంపించారు.  రెండవ నిందితుడైన మౌటం శివ గణేష్ ఉదయం 9.59 నిమిషాలకు తన సెల్ ఫోన్ ద్వారా ఎస్.ఎస్.సి 2019-20 అనే వాటప్స్ గ్రూప్కు ఫార్వడ్  చేయగా, మూడవ నిందితుడు ప్రశాంత్ సెల్ ఫోన్ క్కు ఎస్.ఎస్.సి 2019-20 గ్రూప్ నుండి ప్రశ్న పత్రం రావడంతో ఈ ప్రశ్న పత్రాన్ని నిందితుడు ప్రశాంత్ వివిధ గ్రూపులకు ఫార్వర్డ్ చేసాడు. దీనితో ప్రశ్న పత్రం వివిధ వాట్సప్ 

గ్రూపుల్లో సర్కులేట్  కావడంతో పేపర్ లీక్ అయినట్టు కలకలం రేపింది. విద్యా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు సైబర్ విభాగంతో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి నిందితులను గుర్తించారు.

నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన కాజీపేట ఏసిపి శ్రీనివాస్, ఏసిపి తిరుమల్, సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కమలాపూర్ ఎస్.ఐలు చరణ్, సతీష్, హసన్పర్తి ఎస్.ఐ విజయ్ సతీష్, సైబర్ క్రైమ్ విభాగం ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్ళు కిషోర్, రాజు, ఆంజనేయులు లను వరంగల్ పోలీస్ కమీషనర్ అభినందించారు.




=

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు