పోలీసులపై మండిపడ్డ రేవంత్ రెడ్డి

                                                     పలు చోట్ల సిఎం దిష్టి బొమ్మల దగ్దం


కాంగ్రేస్ పార్టి వార్ రూమ్ పై పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు ఎత్తుకెల్లారని కాంగ్రేస్ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు.రాజకీయ కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే సిఎం కెసిఆర్ ఆదేశాలతో వార్‌ రూంపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు కిరాయి గుండాల్లాగా వ్యవహిరించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్ లో కాంగ్రేస్ పార్టి వార్ రూమ్ పై పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసి కంప్యూర్లు, సెల్ ఫోన్లు తీసుకువెళ్లారు. మల్లురవి, షబ్బీర్ అలీ, హరివర్ధన్ రెడ్డి, అనిల్ యాదవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ ఘటనపై రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

డీజీపీ,పోలీసు అధికారులు ఫోన్లకు స్పందించట్లేదని..వార్‌ రూం సిబ్బందిని ఎక్కడా దాచారో తెలియదన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ సునీల్ కనుగోలు ఆఫీసుపై పోలీసుల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసు సోదాలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. పలు చోట్ల కాంగ్రెస్‌ నేతలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. . హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. అటు ఢిల్లీలోనూ నిరసనలకు సిద్ధమైంది కాంగ్రెస్‌. తెలంగాణ భవన్‌తో పాటు బీఆర్ఎస్ భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది. దీంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో దాడికి నిరసనగా లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌. కేసీఆర్ సౌత్ ఇండియా హిట్లర్‌గా మారారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు