హనుమకొండ జిల్లా సమగ్ర స్వరూపం ఆవిష్కరణ



హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్తు చేపట్టిన తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి,సాహిత్య బృహత్ గ్రంథాల ప్రచురణ పరంపరలో రూపొందించిన హనుమకొండ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో జరిగింది.

జిల్లా పరిషత్ చైర్మన్ డా. ఎం సుధీర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తరతరాల సాంస్కృతిక సంపదను సేకరించి బృహద్ గ్రంధాలుగా వెలువరిస్తున్న సారస్వత పరిషత్ ను అభినందించారు.

తెలంగాణ గొప్పతనాన్ని గురించిన అక్షర సంపదను ముందు తరాలకు


 అందించేందుకు ఈ గ్రంథాలు ఉపయోగపడతాయని తెలిపారు. పరిశోధకులు, కవులు ,రచయితలు ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధిపై గ్రంథాలు రచించాలని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రచనల రూపంలో వెలువరించాలని సుధీర్ కుమార్ సూచించారు.

 సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచారి ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షో పన్యాసం చేస్తూ సారస్వత  పరిషత్తు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు ఏడు జిల్లాల సమగ్ర స్వరూప గ్రంథాలు ఆవిష్కృతమయ్యాయని, సిద్దిపేట, ఆదిలాబాద్, మంచిర్యాల గ్రంథాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన పరిశోధనాత్మక గ్రంథం ఆంధ్రుల సాంఘిక చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈగ్రంథాలు విలువరిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య బన్న అయిలయ్య ప్రసంగిస్తూ  తెలుగు దీపం కొడిగట్టి పోతున్న కాలంలో వెలసిన నాటి ఆంధ్ర సారస్వత పరిషత్ ,నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసార్హమైనవని, భాషకు ప్రాధాన్యం తగ్గిపోతున్న ఈ కాలంలో సాహిత్యాభిమానులు  సారస్వత పరిషత్తు కృషి అవసరమని తెలిపారు.

ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర్ బాబు ప్రసంగిస్తూ పరిషత్తు తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య స్వాగతోపన్యాసం చేస్తూ హనుమకొండ సమగ్ర స్వరూప గ్రంథం వెలువటానికి దోహదం చేసిన కోర్ కమిటీ సభ్యులకు, వ్యాసకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.సమాచార పొర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ పాల్గొన్న ఈసభను

 కోర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎన్.వి.ఎన్.చారి  నిర్వహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు