సీఎం కేసిఆర్ రైస్ మిల్లర్ల ప్రయోజనాల కోసమే ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసిఆర్ ధర్నా చేయడానికి పీఎం మోదీ రైతు చట్టాలు రద్దు చేయడానికి ఏం సంబంధం లేదన్నారు.అసలు సీఎం ధర్నా చేసింది పంజాబ్ రైతుల కోసమా లేక రాష్ట్ర రైతుల కోసమా అని ఆయన బండి సంజయ్ ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కెసి ఆర్ కేంద్ర ప్రభుత్వం పై చేసిన విమర్శలను తిప్పి కొట్టారు.
ఆదివారం మీడియాతో మాట్లాడుతు కెసిఆర్ వైఖరిపై మండిపడ్డారు. వానాకాలం కొనుగోళ్లు చేయడానికే చేతగాని సీఎం కేసిఆర్ ఎండాకాలం పంట గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. యాసంగి పంటలకు సంబంధించి ఫిబ్రవరిలో మాట్లాడాల్సిన కేసిఆర్ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సీఎం కు చిత్తశుద్ది ఉంటే వెంటనే వానకాలం పంటలను కోనుగోలు డిమాండ్ చేశారు. ఢిల్లీ అంత మంది అధికారులను తీసుకు వెళ్లకుండా ధాన్యం కొనుగోలుపై దృష్టిసారిస్తే కోనుగోళ్లు సజావుగా జరిగేవని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రంలో ఎవరు చెప్పలేదని అయన స్పష్టం చేశారు. పీఎంను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న సీఎం కేసిఆర్ ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలపై ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసిఆర్ తో పాటు పలువురు మంత్రులు అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలోనే పూర్తి స్థాయి అంశాలను తేల్చుకుని వస్తామని చెప్పారు. ఇందుకోసం రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని కెసిఆర్ తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత వరి ధాన్యం కోనుగోలు పై బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం తేవ్రస్థాయికి చేరింది.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box