కెసీఆర్ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటే కాంగ్రేస్ నాయకుల పాపాలు పోతాయి- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

 సిఎం కెసిఆర్ ను పొగడ్తల్లో ముంచేందుకు ఆ పార్టి ఎమ్మెల్యేలు మంత్రులు ఓ మోస్తరుకు మించి పోటీ పడుతుంటారు. రేవంత్ రెడ్డి విమర్శలు తిప్పి కొట్టే క్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఊగి పోయారు. సిఎం కెసిఆర్ ను పొగడ్తల్లో ఆకాశానికి ఎత్తారు.


రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో  నిర్వహించిన జంగ్ సైరన్ లో భాగంగా ఎప్పటి లాగే సిఎం కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశాడు. కేసీఆర్‌కి రోజులు దగ్గరపడ్డాయని కల్వకుంట్ల కుటుంబ పాలనకు త్వరలో తెర పడ నుందని అన్నారు. 

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. నాలుకు అదుపులో పెట్టుకోక పోతే రేవంత్‌ను తరిమి తరిమి కొడతామని ఆయన అన్నారు.

సిఎం కెసిఆర్ మహా గొప్ప మనిషని అన్నారు. రాబోయే రోజుల్లో కెసిఆర్ దేశాన్ని శాసించ  బోతున్నాడని అన్నారు.  కెసీఆర్ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటే కాంగ్రేస్ పార్టి నాయకులు గతంలో చేసిన పాపాలు తొలగి పోతాయని అన్నారు. కేసీఆర్ పాలన చూసి కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారంటే రాష్ట్రంలో ఆయన పాలన ఎలా ఉందో ఆర్దం చేసుకోవాలన్నారు.

పాలమూరులో నిర్వహించింది నిరుద్యోగ జంగ్​ సైరనా లేక పోలీస్ వెహికల్స్, ప్రైవేట్ కంపెనీలకు అమర్చే సైరనా అని ఎద్దేవ చేశారు. ఆంధ్రా పార్టీ నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి రూ. 30 కోట్ల లంచం ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని ఆరోపించారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు