ప్రధానితో భేటి ఆయిన సిఎం కెసిఆర్

 రాష్ట్రానికి సంభందించిన పలు అంశలపై లేఖలు అంద చేసిన కెసిఆర్
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార భవన్ నిర్మాణానికి స్థలం కోరిన కెసిఆర్
యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని విజ్ఞప్తి

 


ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం డిల్లీలో  ప్రధాని నరేంద్ర మోడీ ని కల్సుకున్నారు. ఈ సందర్బంగా  రాష్ర్టానికి పలు అంశాలపై ఆయన తో చర్చించారు. డిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.  పలు అంశాలకు సంభందించిన లేఖలు అంద చేసారు. ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలని, రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని, 

హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలని, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని,  ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని,  ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలని, కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలని,  హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలని,  రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తదితర అంశాలపై ప్రధాన మంత్రికి లేఖలు అంద చేశారు. 

 ఈ సందర్భంగా  ఇద్దరి మద్య సుమారు  50 నిమిషాల పాటు చర్చ జరిగింది.  

ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ 'తెలంగాణ భవన్' నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని అట్లాగే  యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని సీఎం కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా, అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు వున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం "తెలంగాణ భవన్" నిర్మించుకునేందుకు, ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కోరారు.  సానుకూలంగా స్పందించిన ప్రధాని, భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రధాని  నరేంద్ర మోడీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా, సీఎం శ్రీ కేసిఆర్ ప్రధానిని ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ, యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు