టోక్యో పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో ఒక్కో పతకం వచ్చి చేరుతోంది. ఇతర పతకాలతో పాటు ఇప్పటికి మూడు స్వర్ణ పతకాలు రాగా బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో షట్లర్ ప్రమోద్ భగత్ ఘన విజయంతో స్వర్ణం సాధించారు. బ్రిటన్కు చెందిన డేనియల్ బెథెల్ను 21-14, 21-17 తేడాతో వరుసగా రెండు సెట్లల్లో 45 నిమిషాల్లో ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడు.
దీంతోపాటు పారాలిపిక్స్లో ఇదే విభాగంలో మనోజ్ సర్కార్ కాంస్య పతకం సాధించారు. మనోజ్ సర్కార్ జపాన్కు చెందిన డైసుకే ఫుజిహారాను 22-20 21-13 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. దీంతో పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. భారత క్రీడాకారులు గెలుచుకున్న మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. వీటిలో 4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో పతకాలతో భారత్ 25 వ స్థానంలో నిలిచింది.
పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్ విభాగంలో సత్తా చాటిన స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్లకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ అద్భుతమైన ఆటతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ కొనియాడారు. ఇదిలాఉంటే.. ప్రమోద్ భగత్.. పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు.
Pramod Bhagat has won the hearts of the entire nation. He is a Champion, whose success will motivate millions. He showed remarkable resilience & determination. Congratulations to him for winning the Gold in Badminton. Best wishes to him for his future endeavours. @PramodBhagat83
— Narendra Modi (@narendramodi) September 4, 2021
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box