సిఎం కెసిఆర్ కు లేఖ రాసిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్వాదీనం చేసుకోవాలన్న ఉద్యోగులు
తెలంగాణ ఉద్యోగులను విధిస్తున్నారని ఆరోపణ
భవణాన్ని  కమర్షియల్  కోసం వినియోగిస్తున్నారన్న ఉద్యోగులు


 ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను స్వాదీనం చేసుకోవాలని కోరుతు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ట్రస్ట్ భవన్ ఉద్యోగులు లేఖ రాసారు.   టీడీపీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఉదోయాగులు లేఖలో కోరడం కల కలం రేపింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌ను స్వాధీనం చేసుకోవాలని కార్యాలయ ఉద్యోగులే స్వయంగా సీఎంకు లేఖ రాయడం తో ఆసలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. ట్రాస్ట్ కార్యక్రమాలకు వినియోగించాల్సిన  భవణాన్ని  కమర్షియల్ గా వునియోగిస్తున్నారని ఉద్యోగుుల ఆరోపించారు.  టీడీపీ రాష్ట్ర కార్యాలయం లీజు ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి తీసుకున్న ఈ భవన్‌లో లీజు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఏకంగా కాల్‌ సెంటర్లకు భవన్‌లోని కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చారని, వెంటనే పరిశీలించి లీజును రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లేఖలో కోరారు.


ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం వినియోగించేందుకు  ఈ స్థలాన్ని 30 సంవత్సరాల పాటుగా లీజుకు తీసుకున్నారు. నిభందనలు మేరకు ఈ భవణాన్ని కమర్షియల్ కోసం వినియోగించరాదు. కాని వినియోగిస్తూ ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను బెదిరింపులుక గురి చేస్తున్నారని ఉదియోగాల నుండి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట కూడా ఎవరూ ఖాతరు చేయడం లేదన్నారు.  భవణం పూర్తిగా  తెలంగాణ టీడీపీ కార్యాలయం అయినప్పటికీ ఏపీ ట్రస్టు ఉద్యోగుల చేతుల్లోనే ఉందన్నారు. 

దశాబ్దాలుగా పనిచేస్తున్న తెలంగాణ వారిని  ట్రస్ట్‌ భవన్‌ ఉద్యోగులుగా గుర్తించడం లేదని ఆరోపించారు. పీఎఫ్, ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు లేవు. కనీసం ఉద్యోగులకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తీసివేసినా ఎలాంటి ఆధారాల్లేకుండా చేశారన్నారు. ట్రస్ట్‌ భవన్‌ను ఇప్పుడు పరిస్థితులు బాగాలేక పోవడంతో ఆర్థిక వనరుగా, వ్యాపార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. భవన్‌లోని పలు విభాగాలను చంద్రబాబు సిబ్బందికి వసతి గదులుగా వినియోగిస్తున్నారు.

ప్రైవేట్‌ హోటల్, క్యాంటీన్‌ నడుస్తున్నాయి. ప్రైవేట్‌ కాల్‌సెంటర్‌కు అద్దెకు ఇచ్చారు. ట్రస్టు పేరుతో లీజుకు తీసుకున్న స్థలంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రస్ట్‌ భవన్‌ లీజును రద్దు చేసి మాకు ఆ కార్యాలయంలోనే మెరుగైన వేతనాలతో పనిచేసే అవకాశం కల్పించాలి.’అని ఎన్టీఆర్‌ భవన్‌ తెలంగాణ ఉద్యోగుల పేరిట విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు