కొత్త జోనల్ ఆమోదంపై సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కెటిఆర్


 కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్త జోనల్ విధానం వల్ స్థానికులకు ప్రభుత్వ ప్రేవేట్ సంస్థల్లో 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయని కెటిఆర్ తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థ రూపొందించేందుకు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించి అన్ని విధాలా అధ్యయనం చేసి అందరికి ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, తెలంగాణ లోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్ అన్నారు.  ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.  ప్రజల ఆకాంక్షల మేరకు పాలన ప్రయోజనాలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేందుకు కొత్త  జిల్లాలు ఏర్పాటు చేసి   ఆయా జిల్లాలకు  ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయడం వలన,  జిల్లా స్థాయి ఉద్యోగం నుండి మొదలు జోన్లు, మల్టీ జోన్ ఉద్యోగాల వరకు ఉన్న అన్ని స్థాయిల ఉద్యోగాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలలో న్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు.

ఇక నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణ్ పేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చి చట్టబద్ధం చేయడంతో పాటు, వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవడం పట్ల ఆయా జిల్లాల ప్రజల తరఫున ముఖ్యమంత్రి కి,  ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీని మించి వివిధ శాఖల ద్వారా 1,33,000 చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువత కి అందించామన్నారు.

కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీ.ఎస్.ఐ.పాస్ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రంలోకి ఆకర్శించగలిగామని పేర్కోన్నారు. ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో స్థానిక యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు దొరికేలా చర్యలు తీసుకుటున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు మరియు యువత పక్షాన  కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు