కత్తి మహశ్ కు ఎపి సిఎం జగన్ భారి సహాయం


 రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  సిని నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి భారి ఆర్థిక సహాయం చేసారు. ఆయన చికిత్స కోసం అవసరం అయ్యే రూ 17 లక్షలు మంజూరు చేశారు. ఇందుకు సంభందించి ఎల్ వోసి ని సిఎం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. హరికృష్ణ పేరిట అపోలో ఆసుపత్రి,చెన్నై కి విడుదల చేస్తు ఉత్తర్వులు జారి చేశారు. ఈ నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదల చేశారు.

జూన్ 26 వ తేదిన మహేశ్ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. మహేశ్ ప్రస్తుతం  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దృష్టికి సంభందించిన ఓ సర్జరి కోసం అవసరం అయిన నిధులను మహేశ్ కు విడుదల చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు