కెసిఆర్ దగ్గరున్న వాళ్లంత ఉద్యమ కారులేనా ? బిజెపి చీఫ్ బండి సంజయ్

 


తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు జరుగ బోతున్నాయని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ రాష్ట్రంలో రోజు రోజుకూ  బలపడుతోందన్నారు. టీఆర్ఎస్‌కు రాష్ట్రంలో నూకలు చెల్లే సమయం ఆసన్నమైందన్నారు. సీఎం దగ్గర ఉన్నవాళ్ళు అంతా ఉద్యమకారులా? లేదంటే ఉద్యమ ద్రోహులా అనేది కేసీఆరే చెప్పాలన్నారు. ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం కీలక పాత్ర పోషించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ నుంచి అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయన్నారు. ఉద్యమంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పైసలాటమొదలు పెట్టారని అన్నారు. ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ నీచంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు