దళితుడిని సిఎం చేస్తానన్న మాట నిలబెట్టు కోవాలి


కెసి ఆర్ కు బండి సంజయ్ సవాల్


దళితుడిని సీఎం చేస్తానని, మాట నిలబెట్టు కోక పోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్ నీ హామీ ఏమైందని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్  ప్రశ్నించాడు. దళితులపై ప్రేమ ఉంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు శాశ్వతంగా దళితుడిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలన్నారు. కొత్త సచివాలయంలో సీఎం కొత్త సీట్లో దళితుడినే కూర్చోబెట్టాలి. దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.''అని సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. అంబేద్కర్ రాజ్యాంగాన్నే మారుస్తానని ప్రకటించాడని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వీడియోలు బయటపడటంతో చర్చను దారి మళ్లించేందుకు అంబేద్కర్ రాగం ఎత్తుకున్నారని  ఆయనపై ప్రేమతో  కాదని విమర్శించారు.
కేసీఆర్ చెప్పిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అంబేద్కర్ స్మృతి భవనం జాడ ఏదని అడిగారు.12 మంది దళితులను కేంద్ర మంత్రులను, దళితుడిని రాష్ట్రపతిని చేయడంతో పాటు ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ దక్కుతుందని ఆయన అన్నారు. కేంద్రంలో దళితులకు ఎంతో చేశామని... ఇక్కడ కేసీఆర్ దళితులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు