కేసీఆర్ కు మూడింది..బండి సంజయ్

  వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే: బండి సంజయ్


కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి అని నిలదీశారు. ఆదివారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో బీజేపీ, మోదీలపై విమర్శలు గుప్పించడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

‘‘కేసీఆర్ కు మూడింది.. దగ్గరపడినప్పుడు భాష అలాగే వస్తుంది. జోగులాంబ అమ్మవారిని కూడా తిట్టేలా, వ్యంగ్యంగా మాట్లాడటం దారుణం. ఇలా మాట్లాడే బదులు రాజకీయాలు వదిలేసి ఇంట్లో ఉండిపోవాలి. కేసీఆర్ దేవుళ్లను తిడతారు, ధర్మాన్ని తిడతారు. సిగ్గుండాలి. కేసీఆర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే ప్రజలు టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం, డ్రైనేజీలో కలపడం ఖాయం. హిందువుల మనోభావాలను కించపర్చేలా కేసీఆర్ మాట్లాడారు. ఇదే సీఎం కేసీఆర్ కు రాజకీయ సమాధి కాబోతోంది.” అని బండి సంజయ్ పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు