భారతీయ సంతతి మహిళా జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్‌కు అత్యున్నత పులిట్జర్ అవార్డు

 జర్నలిజంలో ప్రపంచంలో అతిపెద్ద అవార్డు ఇదే.  ఈ అవార్డును ఈ ఏడాది మేఘ రాజ‌గోపాల‌న్ ద‌క్కించుకున్నారు
 చైనాలో నిర్భంద శిభిరాలపై పరిశోధనాత్మక కథనాలు వెల్లడించినందుకు ఈ ఆవార్డుకు ఎంపికయ్యారు


భారతీయ సంతతికి చెందిన మహిళా జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్‌కు జర్నలిజంలో అత్యున్నత స్థాయి  పులిట్జర్ అవార్డు లభించింది. పులిట్టర్ ను  జర్నలిజంలో ప్రపంచంలో స్థాయిలో అత్యున్నత  అవార్డుగా పరిగణిస్తారు. ఈ అవార్డును ఈ ఏడాది మేఘ రాజ‌గోపాల‌న్ ద‌క్కించుకున్నారు.

చైనా నిర్బంధ శిబిరాల వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించడంలో కీలకపాత్ర పోషించారు మేఘ రాజగోపాలన్‌. మేఘ రాజగోపాలన్ ఉపగ్రహ ఫోటోలను విశ్లేషించి, చైనా మిలియన్ల మంది ఉయ్ఘర్ ముస్లింలను ఎలా ఖైదు చేసిందో ఆర్టికల్స్ రాశారు.

ఈ క్రమంలోనే అమెరికాలో వార్తాప‌త్రిక‌, ప‌త్రికా ఆన్‌లైన్ జ‌ర్న‌లిజం, సాహిత్యం, సంగీత కూర్పుల‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి ఇచ్చే ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు పులిట్జర్‌ కాగా.. మేఘ రాజ‌గోపాల‌న్ మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ఈ అవార్డును గెలుచుకున్నారు.

అమెరికా బజ్‌ఫీడ్ న్యూస్ సంస్థ‌లో ప‌ని చేస్తున్న మేఘ అలిసన్ కిల్లింగ్, క్రిస్టో బుస్చెక్ త‌మ ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించారు. ఎంతో సాహసోపేతంగా ఆమె రిపోర్ట్ చేసిన కథనాలు సంచలనం కలిగించాయి.  మేఘ వార్తలను తీవ్రంగా ప‌రిగ‌ణించిన చైనా ఆమెను సైలెంట్‌గా ఉంచేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.

అవార్డు లభించిన విషయం మీడియా సంస్థలు చెప్పే వరకు ఆమెకు తెలియదు కనీసం ఆమె 

అవార్డుల కార్యక్రమం లైవ్ ప్రసారం అవుతుంటే కూడ ఆ కార్యక్రమం చూడ లేదు. తానునిజంగా షాక్ అయ్యానని ఇంత పెద్ద ఆవార్డు నాకు రాదనే నమ్మకంతో నేనసలు ఆ కార్యక్రమం చూసేందుక ఆసక్తి చూప లేదన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు