రోడ్డు ప్రమాదంలో అయిన గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న ఓయువకుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దయార్ద్ర హృదయం చాటుకున్నారు.
మంగళవారం మంత్రి దయాకర్ రావు పార్టి సభ్యత్వ నమోదు కోసం తన స్వంత నియోజకవర్గం పాలకుర్తికి వెళ్లి కార్యక్రమం ముగించి రాయపర్తికి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లకావత్ చంటి ని రోడ్డుపక్కన పడి ఉండడం చూశాడు. అతన్ని ఆసుత్రికి తరలించేందుకు అతని కుటుంబ సబ్యులు ఏడుస్తూ ఎదురు చూస్తు కనిపించారు. మంత్రి కారు ఆపించి గాయపడిన యువకుడి దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి తెల్సుకుని స్వయంగా మంచి నీళ్లు తాగిపించారు. కుటుంబ సబ్యులను ఓదార్చి ఏం కాదంటూ నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదుపు తప్పి ప్రమాదం జరిగిందని కుటుంబ సబ్యులు మంత్రికి వివరించారు. తన కన్వాయ్ లో ఉన్న భద్రతా సిబ్బంది వాహనంలో గాయపడిన యువకుడిని జనగామ ఆసుపత్రికి తరలించి చికిత్సచేయించాలని ఆదేశించి వైద్య ఖర్చులకు డబ్బులు కూడ ఇచ్చాడు. మంత్రి చూపిన కరుణ పట్ల గాయపడిన యువకుడి కుటుంబ సబ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box