ఉద్యోగం ఇప్పిస్తానని భ్రమలు కల్పించి ఓ కాలేజి విద్యార్థిణి లొంగ దీసుకోవాలని వేధింపులకు గురి చేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు.
మడుగుల శంకర్ అనే వక్తి ఓ కాలేజి అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రెండు సంవత్సరాల నుండి ఆమెకు భ్రమలు కల్పించి వేధింపులకు గురి చేసాడు. తనకు లొంగి పోతే నే ఉద్యోగం ఇప్పిస్తానని లేదంటే లేదని ఫోన్లో అసభ్య కరమైన మాటలతో ఆమ్మాయిని వేధిస్తుండడంతో భరించ లేక ఆ అమ్మాయి హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ డిసిపి పుష్ప ఆదేశాలతో పోలీసులు అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి మడుగుల శంకర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు.
వేధింపులకు గురయ్యే మహిళలు సకాలంలో పోలీసులకు సమాచారం ఇస్తే తగిన విదంగా ఆదుకుని రక్షణ కల్పిస్తామని సెంట్రల్ జోన్ డిసిపి పుష్ప తెలిపారు.
నిందితున్ని పట్టుకుని అరెస్ట్ చేసిన షి టీం ఇన్స్ పెక్టర్ .బి శ్రీనివాస్, హన్మకొండ ఇన్స్ పెక్టర్ చంద్రశేఖర్, సబ్ ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సి.హెచ్.రఘుపతి, షి టీం కానిస్టేబుల్ లక్ష్మి, కానిస్టేబుల్ శ్రీనివాస్ లను అభినందించారు
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box