ఈ 2020 శతగళార్చన కార్యక్రమము 200మందికి పైగా భక్తి తత్వ సాధకుల భాగస్వామ్యం తో Zoom App మరియు YouTube ల ద్వారా ప్రసారం చేయబడినది. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య భాగంగా 100మందికి పైగా పిల్లలు పంపిన అన్నమయ్య కీర్తనలనుండి, 16 కీర్తనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ చిన్నారులు తమ మధురమైన కీర్తనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ప్రముఖ వయొలినిస్ట్ మరియు స్వరకర్త డా. జ్యోత్స్నా శ్రీకాంత్ గారు తమదైన శైలిలో "బ్రహ్మమొక్కటే” కీర్తనను వయోలిన్ పై ప్రదర్శించి అందరినీ అలరించారు. ఈ శతగళార్చన గురించి వందమందికి పైగా రికార్డు చేసి పంపిన 238 కీర్తనలతో అందరి సుగాత్రాలను “ఏక దైవ స్వరూపము" అన్న భావన కలిగించేలా జతచేసి ప్రసారం చేశారు. ఈ కీర్తనలను, విన్నూత్న రీతిలో రోజుకు ఒక కీర్తన చొప్పున YouTube ద్వారా విడుదల చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
శ్రీ ఊలపల్లి సాంబశివ రావు గారు (India), శ్రీ వాణి ప్రభాకరి (India), Dr.జ్యోత్స్నాశ్రీకాంత్ (India) మరియు కవుటూరు రత్నకుమార్ (Singapore) గారు వంటి ప్రముఖుల ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు రూపొందించబడినవి. తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులైన చుక్కల ఉమాదేవి, చివుకుల లావణ్య, రాధాకృష్ణ గణేశ్న, చివుకుల సురేష్, భాగవతుల రవితేజ మరియు ఇతర స్వచ్చందకార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమం సంకలనం చేశామని అంతర్జాతీయ శాఖ అధ్యక్షులు శ్రీ ఊలపల్లి భాస్కర్, విద్యాధరి దంపతులు ప్రకటించారు.
విన్నూత్న రీతిలో, డిజిటల్ మాధ్యమంతో అన్నమయ్య కు నివాళులర్పించిన ఈ కార్యక్రమానికి 15 దేశాలనుండి పలువురు తెలుగు వారు మహోత్సాహంతో ప్రేక్షకులుగా పాల్గొని విజయవంతం చేయటమే కాకుండా, కార్యక్రమం పూర్తయిన రెండు గంటలలోనే 1000 సార్లు చూసి (1393 views at press release time), ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని యూట్యూబ్ కామెంట్స్ పెట్టి పిల్లలను మరియు నిర్వాహకులను ప్రోత్సహించారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box