సబ్బండ కులాలు ఏకమై చట్టసభల్లో బి.సి వాటా సాధించాలి

 సబ్బండ కులాలు ఏకమై చట్టసభల్లో బి.సి వాటా సాధించాలి
గ్రామ గ్రామాన ఏకమవుతున్న బి.సి లు 



   చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం గత 12 రోజులుగా ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ల ఆధ్వర్యంలో తెలంగాణలో కొనసాగుతున్న బి.సి మహా పాదయాత్ర నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలంలోని  భైరవునిబండ, శాలి గౌరారం మండల కేంద్రం, ఉట్కూరు గ్రామాల మీదుగా ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వంద కులాలుగా, వంద వర్గాలుగా విడిపోయి నిత్యం శ్రమ చేస్తూ జీవించే సబ్బండ కులాలు ఏకం కావాల్సిన అవసరముందని, ఐకమత్యంగా పోరాడితేనే చట్టసభల్లో బి.సి వాటా సాధిస్తామని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు, ప్రణాళికలు రూపొందించే చట్టసభల్లో బి.సి లకు జనాభా దామాషా ప్రకారం వాటా లేనందునే బి.సి లు వలసలు పోవడమే కాకుండా బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారని వారన్నారు. దేశ స్వాతంత్ర పోరాటం నుండి తెలంగాణ పోరాటం వరకు ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించిన బి.సి లు నేడు బి.సి ల కోసం జరిగే పోరులో లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బి.సి వీరులు పండుగ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లి లలితక్క,  శ్రీకాంతచారి, మారోజు వీరన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న ల జన్మస్థలాలను సందర్శిస్తూ సాగుతున్న మొదటి దశ  పాదయాత్రను ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీలకతీతంగా కలసి నడిచి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో బి సి వాటా సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఢిల్లీ కి బి.సి దండయాత్ర కొనసాగుతుందని అన్నారు. 

   ఈ కార్యక్రమంలో జాక్ వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వెలుగు వనిత నాయకులు సింగారపు అరుణ, బుచ్చిబాబు, గడిపిపె విమల, బాలస్వామి, ఎర్రమల్ల శ్రీను, బుచ్చిబాబు, చెన్న శ్రావణ్ కుమార్, ఎర్ర శ్రీహరి గౌడ్, గిరగాని బిక్షపతి గౌడ్, అజయ్ పటేల్, చాపర్తి కుమార్ గాడ్గే, అనంతుల రాంప్రసాద్, కొంగర నరహరి, విశ్వపతి, కుంట విజయ్ కుమార్ తదితరులు పాదయాత్ర బృందంలో పాల్గొన్నారు.



    ఈ కార్యక్రమంలో తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర  యువజన అధ్యక్షులు మట్ట రాజు యాదవ్, నిమ్మల గోపీకృష్ణ గౌడ్, నిమ్మల కృష్ణమూర్తి గౌడ్ లు పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి మాట్లాడారు. శాలి గౌరారం మండలం బైరవునిబండకు చెందిన మాజీ సర్పంచ్ ఈదులకంటి యాదయ్య గౌడ్, వెంకటయ్య గౌడ్, గౌడ సంఘం కుల పెద్ద ఈదులకంటి యాదయ్య, సైదులు గౌడ్, వాడేపల్లి లతీఫ్ ముదిరాజ్, వల్దాదుల శంకర్, రాచకొండ సైదులు యాదవ్, కుందూరు వెంకటనర్సయ్య, దండేపల్లి సైదులు, కంభంపాటి శంకర్, శాలి గౌరారం నాయకులు శ్రీకాంత్, బీసు మల్లేష్ గౌడ్, నిమ్మల నవీన్, తిరుపతి సైదులు, పడాల రమేష్, సిరబోయిన రమేష్, తాండారి సోమన్న, నిమ్మల సత్యనారాయణ, రావుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు