మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాసరెడ్డి నియామకం పట్ల టీయూడబ్ల్యూజేే హర్షం

 


మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాసరెడ్డి నియామకం పట్ల టీయూడబ్ల్యూజేే హర్షం


హనుమకొండ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఐజేయు జాతీయ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డిని నియమించడం పట్ల టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా కమిటీ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.ఐజేయు జాతీయ నాయకులు దాసరి క్రిష్ణా రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గడ్డం రాజి రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, కోశాధికారి బి. పురుషోత్తం, రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణ,గుంటి విద్యాసాగర్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు,ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, మాజీ అధ్యక్షులు గడ్డం కేశవ మూర్తి, పిన్నా శివకుమార్, పివి మదన్ మోహన్, జిల్లా కార్యవర్గం,ఆఫీస్ బేరర్ లు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు అయిన శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జర్నలిస్టులకు ఎంతగానో మేలు చేకూరనుందని తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రధానంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులతో పాటు ఇల్లు, ఇళ్ల స్థలాలపై శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్టులకు సముచితమైన న్యాయం జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇటీవల మేడారంలో పర్యటన సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను త్వరగా పరిష్కారం చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు