కెసిఆర్ ఫ్యామిలి పాస్ పోర్ట్స్ సీజ్ చేయాలి - బండి సంజయ్

 


మాజి ముఖ్యమంత్రి కెసిఆర్ సహా ఆయన కుటుంబ సబ్యులందరి పాస్ పోట్స్ సీజ్ చేాయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి బండి సంజయ్ డిమాండ్ చేసారు.  బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు బాాగా వైరల్  అయ్యాయి. కరీం నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిది పార్టి విస్త్రృత స్థాయి కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కెసిఆర్ ఆయన కుటుంబ సబ్యులు విదేసాలుక పారిపోయే ప్రమాదం ఉందన్నారు. వారుదేసం దాటి పోకుండా పాస్ పోర్స్ట్ సీజ్ చేయాలన్నారు.

రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారం చెలాయించిన ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సబ్యులు లక్షల కోట్ల అవినీతిి పాల్పడ్డారని  బండిసంజయ్గతంలో పలు మార్లు ఆరోపించారు.   కెసిఆర్ కు  జైళు తప్పదని బండి సంజయ్ ఛాలెంజ్ చేసారు. 

రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టి అధికారంలోకి వచ్చిన తర్వాత బండి సంజయ్ కెసిఆర్ పై వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి. 

పార్టికార్యకర్తలకు దిశా నిర్దేసం చేసిన బండి సంజయ్ వచ్చే పార్లెమంట్ ఎన్నికలకు సిద్దం కావాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో   ప్రధాన మంత్రి నరేంద్ర మోది సంపూర్ణ మెజార్టీతో మూడో సారి ప్రధాన మంత్రి కాబోతున్నాడని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్లెంట్  స్థానాలు  బిజెపి గెలుచుకుంటుందని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు