ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి బర్రెలక్క పేరెత్తి పవన్ కళ్యాన్ ఇజ్జత్ తీసాడు.
పవన్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశాడు సీఎం జగన్. పలాస సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ అగ్రహం వ్యక్తం చేశారు. “ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగ్ లు కొట్టాడు ఈ ప్యాకేజీ స్టార్…. మ్యారేజి స్టార్.
ఆంధ్రకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్కడ ఇండిపెండెంటుగా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడి పార్టీకి రాలేదు..... డిపాజిట్లు కూడా దక్కలేదు” అని జగన్ దెప్పి పొడిచారు.
ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణాలేంటో తెలుసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. “జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కడున్నా ఆదుకుంటున్నాం. మనసు నిండా అభిమానంతో ప్రజల కోసమే పనిచేస్తున్నాం” అని పలాస సభలో జగన్ వెల్లడించారు.
సీఎం జగన్ తాజాగా ఉద్దానం సమస్యపై దృష్టి సారించారు. పాదయాత్ర సమయంలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశారాయన. ఆస్పత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి బాధలను విన్నారు.ఖచ్చితంగా తాను అధికారంలోకి వస్తే వారి బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఆనాడే హమీ ఇచ్చారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box