ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందెవరు ఇ.డి-సిబిఐ విచారణకు సిద్దమా - కెసిఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

 

కామారెడ్డిలో నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి

కామారెడ్డిలో సిఎం కెసిఆర్ పై పోటీ చేస్తున్న కాంగ్రేస్ పార్టి నేత రేవంత్ రెడ్డి శుక్రవాం నామినేషన్ దాఖలు చేశారు.

ఆయన వెంట కర్నాటక ముఖ్యమంత్రి సిద్ది రామయ్య, ప్రొఫెసర్ కోదండ రాం పాల్గొన్నారు.

భారి జనసందోహంతో ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో బిసి డిక్లరేషన్ విడుదల చేసారు.

కర్నాటక సిఎం సిద్దిరామయ్య, సిపిఐ నాయకులు నారాయణ, చాడా వెంకట్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, పార్టి ఇన్ చార్జి మాణిక్ రావుఠాక్రే, కాంగ్రేస్ పార్టి నేతలు షబ్బీర్ అలి, వి. హన్మంతరావు ఇతర నాయకులు పాల్గొన్నారు.

  కామారెడ్డి సభలో రేవంత్ రెడ్డి  కేసీఆర్ సర్కారుపై నిప్పులు కురిసారు.  తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని కామారెడ్డి ప్రజలు కెసిఆర్ ను ఓడించి ఇంటికి పంపాలని అన్నారు.  

గజ్వేల్ లో అభివృద్ది చేస్తే కెసిఆర్ కామారెడ్డి నుండి ఎందుకు పోటి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

"తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారు. BRSకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం ఆసక్తిగా చూస్తోంది. గజ్వేల్‌ ప్రజలను కేసీఆర్‌ పదేళ్లపాటు మోసం చేశారు. కామారెడ్డి భూములపై కేసీఆర్‌ కన్నుపడింది.. అందుకే పోటీ చేస్తున్నారు." అని రేవంత్ రెడ్డి అన్నారు.


"కేసీఆర్ మాది ఇదే ఊరని చెప్తున్నారు. కోనాపూర్‌లో నీ తల్లి గారి ఊరే అయితే ఆత్మహత్య చేసుకున్న రైతులను ఎందుకు ఆదుకోలేదు. కామారెడ్డిని బంగారు తునక చేస్తా అంటున్న నువ్వు గజ్వేల్‌లో ఏం చేసినవు?. గజ్వేల్ ప్రజలు నీకు అండగా ఉంటే కామారెడ్డికి ఎందుకు వచ్చినవ్. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌తో భూములు కొల్లగొట్టడానికి వస్తున్నారు. షబ్బీర్ అలీ ఓడినా, గెలిచినా మీ వెంటే ఉన్నారు. గంప గోవర్ధన్ తన సీటు పోయిందని ఏడుస్తున్నారు. రెండుసార్లు సీఎం అయి లక్ష కోట్లు సంపాదించారు. ఆయన మనవడికి మంత్రి పదవి కోసం మరోసారి సీఎం అవుతాడట. కేసీఆర్ ను బొంద పెట్టాలని కామారెడ్డిలో పోటీ చేస్తున్నా. షబ్బీర్ అలీ, ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇక్కడ నామినేషన్ వేశాను. 40 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, ఇద్దరు ఎంపీలను కొన్న కేసీఆర్ నాపై ఆరోపణలు చేస్తాడా. ఈ కొనుగోళ్లపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నా.. నువ్వు సిద్ధమా?. సీబీఐ కి లేఖ రాయి.. లేకపోతే కామారెడ్డిలో ముక్కు నేలకు రాయి. కామారెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా." అని రేవంత్ రెడ్డి అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు