సిఎం కెసి ఆర్ మనువడు హిమాన్షుకు డయానా అవార్డు



ముఖ్యమంత్రి కెసిఆర్ ముద్దుల మనవడు  కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు రావుకు ప్రతిష్టాత్మక డయానా అవార్డు లభించింది.  సోమవారం దృశ్యమాధ్యమంలో హిమాన్షు
అవార్డు స్వీకరించారు.
బ్రిటన్‌ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్‌ వర్క్‌ను పరిగణన లోకి తీసుకుని ఎంపిక చేస్తారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్‌ ఖాన్‌పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు.
బ్రిటన్‌లోని ‘తెస్సి ఒజో సీబీఈ’ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్‌ రాజకుమారి డయానా పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలందించే  వారికి ఇస్తోంది.
ఈ సందర్భంగా హిమాన్ష్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ పురస్కారం దక్కించుకున్న హిమాన్ష్‌ తండ్రిగా గర్విస్తున్నానన్నారు. తాత కేసీఆర్‌ మార్గదర్శనంలో సేవలందిస్తూ పురస్కారం పొందానని హిమాన్ష్‌ తెలిపారు. ప్రాజెక్టుకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు