అవార్డు స్వీకరించారు.
బ్రిటన్ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్ వర్క్ను పరిగణన లోకి తీసుకుని ఎంపిక చేస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు.
బ్రిటన్లోని ‘తెస్సి ఒజో సీబీఈ’ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్ రాజకుమారి డయానా పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలందించే వారికి ఇస్తోంది.
ఈ సందర్భంగా హిమాన్ష్కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ పురస్కారం దక్కించుకున్న హిమాన్ష్ తండ్రిగా గర్విస్తున్నానన్నారు. తాత కేసీఆర్ మార్గదర్శనంలో సేవలందిస్తూ పురస్కారం పొందానని హిమాన్ష్ తెలిపారు. ప్రాజెక్టుకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box