సెంచరీ కి చేరువలో పెట్రోల్ డీజిల్ ధరలు
కేంద్ర సర్కారుకు సుబ్రమణ్య స్వామి చురకలు
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు సెంచరీకి చేరు వయ్యాయి. ధరల పై సామాన్యులు మండి పడుతున్నారు.
బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి తన దైన శైలిలో సెటైర్ వేసారు.
రాముడు పుట్టిన ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర రూ.93గా ఉంటే.. సీతాదేవి జన్మస్థలం నేపాల్లో రూ.53గా ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దసరా పండుగకు రావణాసురుడిని దహనం చేయడం ఆనవాయితీ. అలాంటి రావణుడు జన్మించిన శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.51గా ఉందని కేంద్రానికి చురకలు అంటించారు.
ట్విట్టర్ లో ఆయన చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box