ఉత్తరా ఖండ్ లో ఘోర విపత్తు - భారీగా ప్రాణ నష్టం


 ఉత్తరాఖండ్‌లో ధౌలిగంగా నది అకస్మాత్తుగా ఉప్పొంగి ఘోర విపత్తు కలిగింది. ధౌలిగంగా నదికి అనూహ్యంగా వరద రావడంతో మంచు చరియలువిరిగి పడ్డాయి. చమోలీ జిల్లా రైనీ తపోవన్‌ వద్ద పవర్‌ ప్రాజెక్ట్‌లోకి నీరు చేరి భారీ వరద ప్రవాహానికి ఆనకట్ట కొట్టుకుని పోయింది. విద్యుత్‌ కేంద్రానికి చెందిన 150 మంది కార్మికులు వరదలో గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మృత దేహాల సంఖ్య పెరుగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు