ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చవిచూడబోతున్నాడని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదన్నారు.
హైదరాబాద్లో ఓ పత్రికా కాంక్లేవ్లో ఏపీ రాజకీయాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. జగన్ ఇలా చేయడం వల్లే రాజకీయంగా నష్టపోబోతున్నాడని కుండబద్ధలుకొట్టినట్టు పీకే చెప్పారు. తెలంగాణలో కేసీఆర్కి కూడా అదే జరిగిందని అన్నారు. పాలనా కాలంలో ఏం చేశారనేది చూసి ప్రజలు ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించారు. విద్య, ఉపాధి, అభివృద్ధి ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్యాలెస్లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడబోవని కూడ పీకే అన్నారు. ప్రజల మధ్యలోకి రాకపోవడం కూడా జగన్కు మైనస్ కాబోతోందని అన్నారు.
పీకే వ్యాఖ్యలు ఎపీలో ప్రకంపనలు సృష్టించాయి. మరో వైపు వైసిపి నేతలు మండి పడుతున్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box