మేడారం జాతరలో కనుమరుగవుతున్న ఎడ్ల బండ్ల ప్రయాణాలు

మేడారం జాతరలో కనుమరుగవుతున్న ఎడ్ల బండ్ల ప్రయాణాలు

     

మేడారం జాతర ... ఒకప్పుడు ఆదివాసీలు, జానపదులు, గ్రామీణులు పాల్గొనే జాతర. ఈ జాతరకు రెండు దశాబ్దాల కెరటం వరకూ పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లలో వచ్చేవారు. మేదర సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకునేందుకు వచ్చే వారు ప్రధానంగా గ్రామాన గిరిజనులు, తమ ఎడ్ల బండ్లను జంపన్న వాగులోపారే నీటిని తాకడం ద్వారా మేడారం వచ్చేవారు .దీనివల్ల పవిత్ర జంపన్న వాగు జలాలను తాకడంద్వారా తమ గొడ్డు, గోదా లతోపాటు తాము కూడా ఆరోగ్యంగా ఉంటామనేది వారి ప్రగాఢ విశ్వాసం.  కాల క్రమేణా, జంపన్న వాగు పై బ్రిడ్జి నిర్మాణం అనంతరం ఎడ్ల బండ్లపై వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారి సంఖ్య అధికమైంది. 2000 సంవత్సరానికన్నా ముందు మేడారానికి వచ్చే బస్సుల సంఖ్య రెండున్నర వీలుగా ఉండేది. ప్రస్తుతం ఈ బస్సులం సంఖ్య ఆరు వేలకు పెరిగింది. మేడారానికి వచ్చే రహదారుల్లో విపరీతమైన వాహనాల ట్రాఫిక్ ఉండడం, తరచూ ప్రమాదాలతో ఎడ్ల బండి లో ఉండే మూగ జీవాలు ప్రమాదానికి గురయ్యేవి. ఈ కారణం చేత మేడరానికమ్ ఎడ్ల బండ్లద్వారా వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత రెండు జాతరలనుండి ఎడ్ల బండ్ల ద్వారా వచ్చే వారి సంఖ్య వందలకు పడిపోయింది. దీంతో పాటు,  2012 లో మొదటి సారిగా హెలికాఫ్టర్ ను కూడా ప్రవేశ పెట్టారు. 


   1994 జాతర వరకూ భారీ సంఖ్యలో గ్రామీణులు, గిరిజనులు ఎడ్ల బండ్లలోనే వచ్చేవారు. జాతర ప్రారంభానికి ఒకటి, రెండు రోజుల ముందుగానే ఎడ్ల బండ్లలో మేడారం వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకొని సారలమ్మ, సమ్మక్క లు గద్దెలపై ప్రతిష్టాపన అయిన అనంతరం మూడోరోజు పూర్తి స్థాయి దర్శనం చేసుకున్న అనంతరమే తిరిగి వెళ్తారు. 


    1994లో జరిగిన మేడారం జాతరకు 25వేలకు పైగా ఎడ్ల బండ్లు వచ్చాయని అంచనా వేశారు. అయితే, 1996 నుండి జంపన్న వాగుపై భక్తుల స్నానాలకు అనువుగా స్నానఘట్టాలు నిర్మించడం, క్రమక్రమేణా మొత్తం జంపన్న వాగు పొడవునా నిర్మించడంతో, జంపన్న వాగు దాటి మేడారానికి ఎడ్ల బండ్లు వచ్చే అవకాశం పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో,  ఎడ్ల బండ్ల సంఖ్య 90 శాతం తగ్గింది. ఎడ్ల బండ్ల ద్వారా జంపన్న వాగులో నుండి మేడారం చేరుకోవాలనే స్థానిక గిరిజనుల విశ్వాసం. అయితే స్నానఘట్టాలు నిర్మించడంతో జంపన్న వాగు దాటడానికి అనువుగా లేకపోవడం, కాలక్రమేణా వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం వందల సంఖ్యలో మాత్రమే ఎడ్ల బండ్లు జాతరకు వస్తున్నాయి.


     కాగా, స్థానిక గిరిజనుల డిమాండ్ మేరకు జంపన్నవాగుపై 2002 లో బ్రిడ్జి ని నిర్మించారు. దీనితోపాటు వాగు పొడుగునా స్నాన ఘట్టాల ను దాదాపుగా ఊరట్టం క్రాస్ రోడ్డు వరకు నిర్మించారు.దీనితో, ఎడ్ల బండ్ల ద్వారా మేడారం వచ్చే ఆదివాసీ గిరిజనులు,  గ్రామీణులు ఎడ్ల బండ్ల పై రావడం తగ్గించారు. ఇలా, మేడారం జాతర ప్రస్థానం ఎడ్ల బండి నుండి హెలికాఫ్టర్ వరకు మారింది. అయినప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర పశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేడారం, కన్నెపల్లి, ఊరట్టం, కన్నెపల్లి, రెడ్డిగూడెం తదితర పరిసర గ్రామాలలో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాటికి తగు వ్యాధుల నిరోధక మందులను ఇవ్వడం జరుగుతోంది.

         కె.వెంకటరమణ, తేదీ . 16 .2 .2024

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు