అభినందనలు తెలిపిన ఆల్ ఇండియా ఒ బి సి జాక్

 కోదండరామ్ తెలంగాణ ప్రజా ఉద్యమాల కీర్తి పతాక

ఎమ్మెల్సి పదవితో దక్కిన  ఆత్మ గౌరవం


అభినందనలు తెలిపిన ఆల్ ఇండియా ఒ బి సి జాక్



విప్లవోద్యమాల నుండి మొదలుకొని, హక్కుల సంఘాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా తెలంగాణలో కెసిఆర్ దుష్ట పాలన  అంతం కోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఉద్యమాలను గౌరవించినట్లని ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి లభించిన సంధర్బంగా శనివారం హైదరాబాద్ లోని కోదండరామ్ నివాసంలో కలిసి అభినందనలు తెలిపి మాట్లాడారు. ఉద్యమ నాయకులకు పదవులు ఇచ్చి గౌరవిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో కూడా అంతే శ్రద్ధ చూపాలని కోరారు. 

   ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో గడచిన పదేళ్లలో ఎంతో అణచివేతకు జరిగిందని, ఉద్యమకారులను తీవ్రంగా అణచివేసి, ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారని అన్నారు. ఎన్నో ఉద్యమాలలో కీలకపాత్ర పోషించి ప్రజల కష్టాలను, తెలంగాణ బాధలను దగ్గర నుండి చూసిన నేను నాకు లభించిన పదవితో తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. 

  ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మహమ్మద్ మహమూద్, బి.సి నాయకులు కూనూరు రంజిత్ గౌడ్, కంకటి సాగర్ లు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు