బిగ్ బాస్ అభిమానుల పిచ్చి - ధ్వంసం అయినే ఆర్టీసి బస్సులు - కేసు నమోదు చేసిన పోలీసులు


 బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్  విన్నర్  వి ప్రశాంత్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమోటోగా కేసు నమోదు చేసారు.  సెక్షన్ 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

పల్లవి ప్రశాంత్‌కు చెందిన పలువురు అభిమానుల పైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు.

 బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరిగిన అన్నపూర్ణ స్టూడియో దగ్గర పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు పెద్ద సంఖ్యలో  చేరుకుని గొడవ పడ్డారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను బిగ్ బాస్ విన్నర్‌గా ప్రకటించిన తర్వాత ఇరువురి అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో అక్కడ ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాలపై దాడులు చేసి హంగామా సృష్టించారు. ఈ గొడవలో పలి బస్సులు ధవ్సం అయ్యాయి. 

ఆర్టీసి ఎండి సజ్జనార్ ఈ గటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ధవ్సం అయిన బస్సుల ఫోటోలు సామాజిక మాద్యమంలో షేర్ చేశారు.

అభిమానం పేరుతో పిచ్చి చేష్టలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదని, ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడిగా భావించాల్సిందే అన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు