ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై విధివిధానాలు ఖరారు

 


ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై విధివిధానాలు ఖరారు

ఆర్టీసి బస్సుల్లో మహిళలకు  ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం విధివిధానుల ఖరారు చేసింది. శనివారం మద్యాహ్నం ఈ పథకాన్ని సిఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

శుక్రవారం ఆర్టీసి ఎండి సజ్జనార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిన కల్సి  ఉచిత బస్ ప్రయాణంపై చర్చించారు. ఉచిత బస్ ప్రయామం చేసే మహిళలు ఏదైనా గుర్తింపు కార్డు తప్పని సరిగా కలిగి  ఉండాలి.

ఆర్టీసి ఎండి సజ్జనార్ మీడియాకు తెలిపిన వివరాల మేరకు ఎక్స్ ప్రెస్ బస్సులతో పాటు పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతించనున్నారు.

 ప్రజారవాణా వ్యవస్థలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం


* వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, వృద్ధులు జర్నీ చేయవచ్చు


* ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు


* ఆధార్, ఓటర్, డ్రైవింగ్, పాన్ కార్డు, పాస్ పోర్టు, స్టేట్, సెంట్రల్ ఐడీకార్డులు చూపిస్తే చాలు


* రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు.. లిమిట్స్ లేవు..


* రోజుకు ఎన్నిసార్లైనా బస్సుల్లో జర్నీ చేసే అవకాశం


* మహాలక్ష్మీ స్కీమ్ తో ప్రజా రవాణా పుంజుకుంటుంది


* ఫ్రీ జర్నీపై ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు


* వారం తర్వాత బస్సుల్లో మహిళలకు ఫ్రీ టికెట్ ఇస్తాం


* భవిష్యత్తులో ఆర్టీసీ సంస్థలో నియమాకాలు ఉంటాయి


* రద్దీకి తగ్గట్లు అందుబాటులోకి బస్సులను ఏర్పాటు చేస్తారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు