టిడీపి - జన సేన పొత్తు -బిజెపి కల్సివస్తుందని ఆశాభావం

 చంద్రబాబుతో ములాఖత్ అనంతరం ప్రకటించిన పవన్ కళ్యాన్


తెలుగుదేశం పార్టీతో జన సేన పార్టి పొత్తు  కుదిరిందని జన సేన పార్టి అధినేత పవన్ కళ్యాన్ ప్రకటించారు. బాలకృష్ణ, లోకేష్ తో కల్సి పవన్ కళ్యాన్ గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైళులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో  తెలగుదేశం పార్టి జనసేన కల్సి పోటీచేయాలని నిర్ణయించారు.  చంద్రబాబు తో ములాఖత్ అనంతరం జైళు బయట పవన్ కళ్యాన్ మీడియాతో మాట్లాడుతు ఈ విషయాలు వెల్లడించారు. 

ఎన్నికల్లో కల్సి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చామని భారతీయ జనతా పార్టి కూడ తమతో కల్సి వస్తుందని ఆశిస్తున్నానని పవన్ తెలిపారు. రాష్ర్ట, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.  చంద్రబాబు అరెస్టుకు వెనక బిజెపి ప్రమేయ లేదని అన్నారు. చంద్రబాబు అరెస్టు విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోం మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. 

రాష్ర్టంలో గత నాలుగున్నరేళ్లుగా జగన్ అరాచక పాలన సాగుతోందని  అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపించారని విమర్శించారు. ఆయనకు సంఘీభావం ప్రకటించడానికే రాజమహేంద్రవరం వచ్చినట్లు చెప్పారు.


జగన్ మద్దతుదారులకు ఇంకా 6 నెలలే సమయం ఉందని, వాళ్లు యుద్ధం కోరుకుంటే వాళ్లకు యుద్ధమే ఇస్తామని  ఎవరినీ వదిలిపెట్టబోమని, ఇసుక దోపిడీ, మైనింగ్, బెల్ట్ షాపులు నిర్వహించిన వారందరినీ బయటకు లాగుతామని హెచ్చరించారు. 


నేను 2014లో నరేంద్రమోదీకి మద్దతు తెలిపిన సమయంలో ఆయన సొంత పార్టీ వ్యక్తులే ఆయన ప్రధాని కాకూడదని అనుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి నేను మోదీ మద్దతు తెలిపాను. ఈ రోజున నేను నా " మనసును ఆవిష్కరిస్తున్నా. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలి. మా నాన్నగారి అస్థికలు కాశీలో  కలపడానికి వెళ్లినప్పుడు ముంబయిలో ఉగ్రవాదులు తాజ్ హోటల్పై దాడి జరిగింది. అంతకుముందు పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీగారికి మద్దతు తెలినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ఆ రోజు నుంచి నరేంద్రమోదీ పిలిస్తే తప్ప నేను వెళ్లలేదు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలని 2014లో భాజపా, తెదేపాతో కలిసి పోటీ చేశాం. ఆంధ్రప్రదేశ్కు చాలా అనుభవం ఉన్న నాయకుడు " కావాలని భావించా. 2020 విజన్ గురించి మాట్లాడినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ఇవాళ లక్షలాది మాదాపూర్ వంటి ఐటీ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఆయనతో ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే విభేదించా. వ్యక్తిగతంగా ఏనాడూ విభేదించలేదు. " అని పవన్ అన్నారు.


రూ.300 కోట్ల స్కామ్ పేరు చెప్పి మాజీ సీఎంకు అవినీతి అంటగడుతున్నారు. గుజరాత్లో ప్రారంభమైన కంపెనీ కాంట్రాక్టు ఇచ్చారు. అది హార్డ్వేర్ను సప్లయ్ చేస్తుంది. ఏదైనా తప్పు జరిగితే అందుకు సంబంధించిన వ్యక్తులను విచారించాలి. అలాంటిది సైబరాబాద్ వంటి సిటీని నిర్మించిన వ్యక్తిని ఇలాంటి కేసులో ఇరికించడం బాధాకరం. ఈడీ విచారించాల్సిన ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ఇలా చేయడం రాష్ట్రానికి మంచిది కాదు. పోనీ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా. వాజ్పేయా? లాల్ బహదూర్ శాస్త్రినా? ఈడీ కేసులను ఎదుర్కొంటున్నాడు. దేశం విడిచి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తీసుకుంటున్నాడు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసే వ్యక్తి. అందరినీ భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి" అడ్డగోలు దోపిడీ

"డేటా చౌర్యం జరుగుతోందని వాపోయిన వ్యక్తి ఇవాళ వాలంటీరు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అదే పని చేస్తున్నాడు. అడ్డగోలు హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదు. అడ్డగోలు దోపిడీ మాత్రమే చేస్తున్నారు. మద్యం విషయంలోనే కోట్లు జేబుల్లోకి వేసుకుంటున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వ్యక్తులను ఏపీ సరిహద్దుల్లో ఆపేస్తున్నారు. అలా ఆపే హక్కు ఎవరికీ లేదు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లోనే చెప్పాను. దానికే 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని కలగన్న వ్యక్తిలో ఉలికిపాటు మొదలైంది. చంద్రబాబు భద్రత విషయాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమితా దృష్టికి తీసుకెళ్తా.." అని పవన్ కల్యాణ్ అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు