పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఏకైక కుమార్తె, సుచేతన భట్టాచార్య (Suchetana Bhattacharya) సంచలన నిర్ణయం తీసుకున్నారు. లింగ మార్పిడి చేసుకొని మగాడిగా మారనున్నట్లు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఏకైక కుమార్తె, సుచేతన భట్టాచార్య (Suchetana Bhattacharya) సంచలన నిర్ణయం తీసుకున్నారు. లింగ మార్పిడి చేసుకొని మగాడిగా మారనున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత తన పేరును సుచేతన్గా మార్చుకోనున్నట్లు తెలిపారు. సెక్యువల్ ఓరియంటేషన్ మార్చుకోవడం కష్టం, కానీ అసాధ్యం కాదని చెప్పేందుకు ఆమె ఒక అడుగు ముందుకేశారు.
LGBTQ కమ్యూనిటీ ప్రతి జూన్ నెలను ‘ప్రైడ్ మంత్’గా సెలబ్రేట్ చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కోల్కతాలో జరిగిన LGBTQ వర్క్షాప్లో సుచేతన పాల్గొన్నారు. అక్కడ లింగ మార్పిడి గురించి తన కోరికను వ్యక్తపరిచారు. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆమె తనను సుచేతన్ అని పరిచయం చేసుకోవడం విశేషం.
ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన నిర్ణయం అంత సులభం కాదన్నారు. చాలా కాలం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘ఈ వర్గానికి చెందిన వ్యక్తులు సమాజంలోని ప్రధాన స్రవంతికి ఎప్పుడూ భిన్నంగా ఉండరు. వారు కూడా ఈ సమాజంలో భాగమే. కాబట్టి వారికి అండగా నిలబడాలని అన్ని రాజకీయ పార్టీలు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని తెలిపారు.
డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ LGBTQIA+ సంస్థ కన్వీనర్ సుప్రభా రాయ్ రాసిన ఒక ఆర్టికల్ “స్టోరీ ఆఫ్ ప్రైడ్ మంత్” పేరుతో ఫేస్బుక్లో పబ్లిష్ అయింది. దీంట్లో రాయ్, సుచేతన గురించి రాశారు.
“అతడికి స్పృహ, అవగాహన ఉంది. పీపుల్స్ రిలీఫ్ కమిటీ నిర్వహించిన LGBTQIA+ పీపుల్స్ హెల్త్పై వర్క్షాప్లో అతడు పాల్గొన్నాడు. అదే అతడితో నాకు మొదటి మీటింగ్. చేతిలో మైక్రోఫోన్ పట్టుకొని నిలబడి ఉన్న అబ్బాయి సుచేతన్.
సుచేతన్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు. అతడు తన స్వంత కథను తన పరిమితుల్లో ఉంచుకోవాల్సి వచ్చింది. LGBT కమ్యూనిటీ వర్క్షాప్లలో పాల్గొన్న తర్వాత సుచేతన్ ఎంతో ప్రేరణ పొందాడు.” అని సుప్రభా రాయ్ రాశారు. ఈ క్రమంలో సుచేతన లింగమార్పిడి నిర్ణయం ప్రకటించడం విశేషం.
సుచేతన్ తండ్రి బుద్ధదేవ్ భట్టాచార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతడి తల్లి మీరా భట్టాచార్యకు కొన్ని రోజుల క్రితం కొత్త పేస్మేకర్ అమర్చారు. ఇటీవల అతడు సుచంద్రను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. సుచేతన్, సుచంద్ర కలిసి ఒక ఇల్లు కట్టుకున్నారు. సుచేతన్ ఆడియో విజువల్ కంపెనీలో ఫ్రీలాన్సర్గా, సుచంద్ర ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.” అని సుప్రభా రాయ్ వెల్లడించారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box