తంబాకు ఆరోపణలపై కెటిఆర్ కు సవాల్ విసిరిన బిజెపి చీఫ్ బండి సంజయ్


 కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారు, అతని రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా... నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతో సహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా.... మరి నీకు రక్తం, వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా?

ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారు. తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరుతున్నాను.  


ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాలోని మామ్డ మండలం దిమ్మదుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం వారం రోజుల పాటైనా ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు TRS పార్టీ ఒక గంట సమయం కూడా కేటాయించదు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. వారం రోజులపాటు తెలంగాణలోని ప్రతీ బస్తీలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం వచ్చాక నిర్వహిస్తాం. అంబేద్కర్ చరిత్రను తెలియజేయాల్సిన అవసరం మనపై ఉంది. నేను ఈరోజు ఎంపీ ని అయ్యాను అంటే... అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ దేశాన్ని ప్రధాని మోదీ జీ పాలిస్తున్నారు. తను ప్రధాని అయ్యాకే పేదోళ్లకు ఈ దేశంలో న్యాయం జరుగుతోన్నది. రామ్నాథ్ కోవింద్ గారిని భారత రాష్ట్రపతి ని చేసిన ఘనత బీజేపీ పార్టీది. పార్లమెంటులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన పార్టీ బిజెపిది. అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకే... 'పంచ తీర్థాల' పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. 12 మంది ఎస్సీ ఎంపీలను, కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత, ఎంతోమంది ఎస్సి లను గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత బిజెపి పార్టీది. ప్రతి సంవత్సరం 1,20,000 మంది దళిత యువకులను, పారిశ్రామిక వేత్తలుగా మార్చుతున్న ఘనత బిజెపిది. కేసీఆర్ దళితుడిని సీఎం చేశాడా? దళితులకు మూడెకరాల పంపిణీ హామీ ఏమైంది? కెసిఆర్ దృష్టిలో.. దళితుడికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి లకు కేసిఆర్ ఎందుకు బయటకు రాడు? కెసిఆర్ తప్ప, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు వెళతారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే కేసీఆర్ మారుస్తానంటున్నాడు... కేసీఆర్ అంతా పోటుగాడా? తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని చూస్తున్నాడు. ప్రశ్నించక పోవడంతోనే ముఖ్యమంత్రికి బలుపెక్కి, బరితెగించి ఈరోజు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. నేటికీ తెలంగాణ దళిత బస్తీల్లో కనీస సౌకర్యాలు లేవు.


G20 దేశాల్లో భారతదేశానికి అధ్యక్షత వహించే అవకాశం రావడం మనందరికీ గర్వకారణం. జి 20 సదస్సులో అందరి సూచనలను తీసుకునేందుకు, అన్ని పార్టీల అధ్యక్షులను మోదీ ఆహ్వానిస్తే... కేసీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారు? జి 20 సన్నాహక సమావేశాని కంటే కేసీఆర్ కు ఇక్కడ పీకే పనేముందనీ ప్రశ్నిస్తున్నాను.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు