జస్టిస్ గుండా చంద్రయ్య గారు
మానహక్కుల కమీషన్ చైర్ పర్సన్
తెలంగాణ రాష్ర్టం
హైదరాబాద్ గారికి
హైదరాబాద్ నగరం లోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ గంజి రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని రఘు కుటుంబానికి న్యాయం చేయాలని ఈ షయంలో మీ జోక్యం కోరుతు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిద జిల్లాల జర్నలిస్టులం తీవ్ర ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నాం.
ప్రజల పక్షాన నిలిచి అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన పాపానికి జర్నలిస్ట్ రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసారు. జర్నలిస్ట్ రఘు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అమానుషంగా ఉంది. జూన్ 3 వ తేదీన మార్కెట్ లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్లిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్లారు. రఘును ఎవరు తీసుకు వెళ్లారో ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలియక పోవడంతో తోటి జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గుర్రం పోడు భూముల వ్యవహారంలో భాదితుల పక్షాన నిలిచి జర్నలిస్టుగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే రఘు చేసిన నేరమనుకుంటే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సి ఉండేది. రఘుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అసలు వచ్చిన వారు పోలీసులా లేక ప్రైవేట్ గుండాలా అనేది తెలియకుండా మఫ్టీలో వచ్చి బజారులో అందరూ చూస్తుండగా బలవంతంగా ఎత్తుకెళ్లిన దృష్యాలకు సంభందించిన ఫుటేజీలు కూడ ఉన్నాయి. గుర్రంపోడు భూముల విషయంలో రఘు పై మోపిన కేసులు పూర్తిగా అక్రమ మైనవి. జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి కనీసం కుటుంబ సబ్యులకు సమాచారం కూడ ఇవ్వకుండా పట్టుకెళ్లడం పూర్తిగా అమానుషం. చట్టం పరిధిలో చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చట్టాన్ని పాటించకుండా అన్యాయంగా అక్రమంగా రఘును అరెస్ట్ చేసి మానవ హక్కులకు విఘాతం కల్పించారు. రఘు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో జర్నలిస్టులను తీవ్ర ఆందోళన పరిచింది. రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవ హక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ రఘుకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
కృతజ్ఞతలతో
తెలంగాణ జర్నలిస్టులు
కన్నా పరశు రాములు
కూన మహేందర్
మండువ రవీందర్ రావు
పి.వి.కొండల్ రావు
నారా సుబ్రమణ్యం
కృష్ణా రెడ్డి (నాగర్ కర్నూల్)
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box