వకీల్ సాబ్ మూవీ సక్సెస్ పట్ల నాగబాబు
ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు అనమతులు ఇవ్వక పోయిన విషయంలో పవన్ కళ్యాన్ సోదరుడు నాగబాబు స్పందించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అలాంటి పనులు చేసే వ్యక్తి కాదని తాను నమ్ముతున్నానని అన్నారు. ఎమ్మెల్యేలు ఇతర నాయకులు షోలకు అనముతులు రాకుండా చేసి ఉండవచ్చని అన్నారు. ఒక వేళ జగన్ మోహన్ రెడ్డికి ఈ విషయం తెలిస్తే తప్పుకుండా ఆయన స్పందించే అవకాశ ఉందని అన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఫర్వాలేదు గాని వృత్తిపర మైన జీవితంలో ఇాలాంటి ఆటంకాలు కలిగితే సినిమా ఇండస్ట్రీపైనే ఆధారపడి బతుకుతున్న అనేక కుటుంబాలు ఆగం అయిపోతాయని నాగబాబు ఆవేదన వ్యక్తం చేసారు.
వకీల్ సాబ్ సినిమా గురించి నాగబాబు మాట్లాడుతు పవన్ కళ్యాన్ సినిమాలో నటించ లేదని సాధారణ జీవితంలో ఎలా ఉంటాడో అలా కనిపించాడని అన్నాడు. ధియేటర్ లోసినిమా చూసి తాను చాలా రోజులు అయిందని నాగబాబు అన్నారు. చాలా గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చూసానని అత్తారింటికి దారేది తర్వాత పవన్ నటించిన సినిమాలు ఏవి చూడలేదని అన్నారు. అజ్ఞాత వాసి మూవీ ఆశించిన మేరకు ఫలితాలు రాలేదని అన్నారు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాన్ రాజకీయాల్లో బిజీ అయ్యాడని మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రావడం తనకు చాలా అనందం కలిగించిందని నాగ బాబు అన్నారు.
పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడ వకీల్ సాబ్ సినిమా సక్సెస్ పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశాడు. చిరంజీవి తన తల్లితో పాటు కుటుంబ సబ్యులతో కల్సి సినిమా చూసాడు. చిరంజీవి కుటుంబం అంతా సినిమా ఇండస్ట్రి ఫ్యామిలి కావడంతో పవన్ కళ్యాన్ సినిమాలు కొద్ది కాలంగా సక్సెస్ కు నోచు కోక పోవడం వారిని కొంత భాదించింది. అయితే చాలా రోజుల తర్వాత వచ్చిన వకీల్ సాబ్ సినిమా సక్సెక్ కావడం పట్ల చిరు ఫ్యామిలీలో అందరూ ఆనందంతో ఉన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box