హోం వర్క్ చేయక కిడ్నాప్ డ్రామా - పోలీసులకు షాక్

  కర్నాటకలో జరిగిన సంఘటన 


కిడ్నాప్ - రేపులతో ఓ వైపు దేశ వ్యాప్తంగా కేసులు కలకలం రేపుతుంటే మరో వైపు వాటి పేరిట అమ్మాయిలు పోలీసులను, తల్లిదండ్రులను బురిడి కొట్టించే కేసులు కూడ నమోదు అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ కు చెందిన బి - ఫార్మసి విద్యార్థిణి తాను కిడ్నాప్ అయ్యానని తల్లి దండ్రులను పోలీసులను నమ్మించాలని చూసి దొరికి పోయింది. అసలు వాస్తవాలు తెల్సిన తర్వాత ఆమె కిడ్నాప్ పేరిట నాటకం ఆడిన విషయం బయట పడింది.దాంతో తల్లి దండ్రులు- పోలీసులు అగ్రహం వ్యక్తం చేయగా  ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడడంతో  కిడ్నాప్ కథ చివరికి విశాదాంతంగా మారింది.

కర్ణాటక ఉత్తర‌కన్నడ జిల్లాలోని నందొళ్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిణి కూడ ఇట్లాగే కిడ్నాప్ డ్రామా ఆడింది.స్కూలుకు వెళ్లిన విద్యార్థిణి ఇంటికి తిరిగి రాక పోవడంతో తల్లి దండ్రులు ఆ మెకోసం గాలించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. గ్రామం సమీపంలో ఉన్న అడవిలో వెదకగా విద్యార్థిణి ఓ చోట తాళ్ళతో బందించి బడి కనిపించింది. పోలీసుులు ఆమెను విడిపించి విచారించగా తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆత్యాచారం జరిపారని అఁదరూ షాక్ అయ్యేలా చెప్పింది. దాంతో పోలీసులు ఆ విద్యార్థిణి ని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్విహంచారు. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరగ లేదని నిర్దారణ కావడంతో పోలీసులు ఆ బాలికను నిల దీసారు.  దాంతో బాలిక తనపై ఎలాంటి అత్యాచారం జరగ లేదని స్కూలులో హోం వర్క్ చేయ లేదని అందుకే కిడ్నాప్ నాటకం ఆడానని పోలీసులకు చెప్పింది. ఆ బాలిక నాటకం లో ఇంకా ఎవరైనా పాలు పంచుకున్నారా లేక ఆ బాలికే ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా ఈ నాటకం అంతా ఆడిందా అనేది విచారిస్తున్నారు. పోలీసులు ఆ బాలికపై కేసు నమోదు చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు