డబ్బులు ఇస్తే ప్రధాని నరేంద్ర మోదీని హత్యచేస్తానన్న వ్యక్తి అరెస్ట్

సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో ఏది పడితే అది పోస్ట్ చేయడం చాలా ప్రమాదకరం. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే హత్య చేస్తానంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి అడ్డంగా బుక్ అయ్యాడు.


దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ప్రకటించిన వ్యక్తిని పోలీసులు గాలించి పట్టుకున్నారు. పుదుచ్చేరిలోని అర్యణ్‌కుప్పం గ్రామానికి చెందిన సత్యానందం (43) అనే రియల్ ఎస్టేట్‌ వ్యాపారిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సత్య సత్య అనే ఫేస్ బుక్ ఖాతాతో ఫేస్ బుక్ లో సత్యానంద ఏకంగా ప్రధాన మంత్రినే చంపుతానంటూ పోస్ట్ చేశాడు. ఎవరైనా తనకు రూ.5 కోట్లు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపుతానంటూ పోస్ట్ చేయడంతో ఓ టాక్సి డ్రైవర్ ఆ పోస్ట్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దర్యాప్తు చేపట్టిన ోలీసులు ఫేక్ బుక్ అక్కౌంట్లను జల్లెడ పట్టారు. పుదుచ్చేరికి సమీపంలో ఉన్న సత్యానందం ఈ పోస్టు చేసినట్లు ట్రేస్ చేసి అరెస్ట్ చేసారు. ప్రజల మధ్య అల్లర్లు సృష్టించడం, శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలపై ఐపీసీ సెక్షన్లు 505 (1), 505 (2) కింద సత్యానందంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు జైళుకు రిమాండ్ కు తరలించారు.

గత నెల జనవరి 6 వ తేదీన కర్నాటక రాష్ట్రానికి చెందిన అన్వర్ అనే యువకుడు ప్రధాని నరేంద్ర మోదీని హోం మంత్రి అమిత్ షా లను చంపుతానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా పోలీసులు అరెస్ట్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు