కేసీఆర్తో బిజెపి ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదు
కెటిఆర్ సిఎం అయితే అణుబాంబు పేలుతుంది
అసహనంతో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టి మారకుండా ఉండేందుకే కెసిఆర్ పొత్తుల పేరుతో కొత్త డ్రామాలు అడుతున్నాడని బిజెపి చీఫ్ బండి సంజయ్ విమర్శించాడు. నటనలో కెసిఆరు ను మించిన వారు లేరని కెసిఆర్ ను పెట్టి సినిమా తీస్తే 20 గంటల్లో సినిమా పూర్తి అవుతుందని అన్నారు.
శుక్రవారం వరంగల్ నగరంలో పర్యటించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ బిజెపితో పొత్తు పెట్టకుంటారని వచ్చిన వార్తల నేపద్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ స్పందించారు. దమ్ముంటే కేసీఆర్ నాతో ఢిల్లీకి రావాలి. పొత్తులపై ఎవరు హామీ ఇచ్చారో తేలుస్తా నని అన్నారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని రక్తపు మడుగులో రాజ్యం ఏలుతున్న కేసీఆర్తో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని బండి సంజయ్ స్పష్టం చేసారు. కెటిఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఆటం బాంబు కాదు అణు బాంబు పేలు తుందన్నారు.
కెటీఆర్ ను సీఎంను చేసే ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్.. ఫామ్ హౌస్లో దోష నివారణ పూజలు చేశారన్నారు. హోమ ద్రవ్యాలను త్రివేణి సంగమంలో కలపడం కోసమే కాళేశ్వరం వెళ్లారని చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వెనుక అసలు రహస్యం శనిపూజ కోసమేనన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box