ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు



            ఉన్నతాధి కారులతో సమీక్షించిన ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి


కాంగ్రేస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త తొలిసారిగా నిర్వహిస్తున్న  తెలంగాణ రాష్ప్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వేడుకలకు కాంగ్రేస్ పార్టి అగ్ర నాయకురాలు సోనియాగాంది ప్రత్యేక ఆహ్వనితులుగా హాజరు కానున్నారు.

ఏర్పాట్లలో ఎక్కడా విమర్ళలకు తావు లేకుండా ఉండాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉన్నతాధికారులతో  సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో, అందుకు తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహించనున్నట్లు సీఎస్‌ తెలిపారు. ముఖ్యమంత్రి ముందుగా గన్ పార్క్ ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారని అన్నారు. 

      ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని  పోలీసు శాఖను ఆదేశించారు.  ప్రజలు ఎండలో ఇబ్బందులు పడకుండా షామియానాలు ఏర్పాటు తేయాలని   ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు.

          సభా ప్రాంగణం పరిసర ప్రాంతాలలో పారిశుద్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని  జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నిరంతరాయంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.

        డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ముఖ్య కార్యదర్శులు బి వెంకటేశం, జితేందర్, కార్యదర్శులు క్రిస్టినా జోంగ్తు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ  సుదర్శన్ రెడ్డి, టీఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

-

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు