కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో జాతీయ స్థాయి స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం "సమ్ శోధిని'23" ప్రారంభోత్సవం

 కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో జాతీయ స్థాయి స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం  "సమ్ శోధిని'23" ప్రారంభం


కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో జాతీయ స్థాయి స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం  "సమ్ శోధిని'23" శుక్రవారం ప్రారంభమైంది.   

ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐ యస్ టి ఈ) కిట్స్ స్టూడెంట్ విద్యార్థి చాప్టర్,  కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు)  తో పాటు టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్)తో పాటుగా 9 విభాగాలు సంయుక్తంగా జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం "సుమశోధిని'23" కిట్స్ క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. 


 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రీసెర్చ్ సెంటర్ ఇమారత్, హైదరాబాద్ డిఆర్డి వో , సైంటిస్ట్ జి. విజయ దుర్గ జ్యోతి ప్రజ్వలన చేసి  సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్లో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.  



 ఈ  సందర్భంగా  మాజి రాజ్యసభ సభ్యులు సంస్థ  చైర్మన్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు ,కోశాధికారి పి.నారాయణరెడ్డి  సమ్ శోధిని'23 సాంకేతిక విద్యార్థి పండుగ ప్రారంభోత్సవం సందర్బంగా  విద్యార్థి చాప్టర్,  టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ను అభినందించారు.



ఈ సందర్భంగా ముఖ్య అతిథి, రీసెర్చ్ సెంటర్ ఇమారత్, హైదరాబాద్ DRDO, సైంటిస్ట్-జి,  శ్రీమతి జి. విజయ దుర్గ మాట్లాడుతూన్యూరల్ నెట్‌వర్క్‌ల కోసం ఆర్కిటెక్చర్‌లు, VLSI-DSP ఫంక్షన్‌లతో కూడిన కొరోలజీ వంటి ప్రాథమిక బ్లాక్‌లు, రోబోటిక్స్ అప్లికేషన్‌లు మరియు హార్డ్‌వేర్‌కు అవసరమైన వినూత్న నైపుణ్యాల ఆవిష్కరణలను ప్రస్తావించారు. రక్షణ సంబంధిత డిజైన్లలో శక్తిని ఆదా చేయడం చాలా ముఖ్యమని,  ANN అప్లికేషన్‌ల కోసం కాంప్లెక్స్ చిప్స్ ఆర్కిటెక్చర్‌లు; బలాన్ని పెంపొందించడం- రక్షణ, అంతరిక్షం, టెలికమ్యూనికేషన్ ప్రాజెక్టులు; ఎకో సిస్టమ్ బిల్డ్-అప్  లతో పాటుగా స్వంత IPలను రూపొందించాలన్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన లైబ్రరీలను ఉపయోగించడం సరిపోదని IPల- ఆవిష్కరణ, విశ్వసనీయత మరియు అప్-డేటింగ్ కోసం అభివృద్ధి చేయాలన్నారు. యువ వర్ధమాన ఇంజనీర్ల కోసం వినూత్న ఆలోచనలు, స్టార్ట్-అప్‌లకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు కిట్స్ వరంగల్ యాజమాన్యాన్ని ఆమె ప్రశంసించారు.

 విద్యార్థులు కోడింగ్, హై లెవెల్ సింథసిస్ స్కిల్స్, గూగుల్ ద్వారా క్లౌడ్ సర్వీస్‌కు సంబంధించి నైపుణ్యాన్ని సాధించాలని అట్లాగే స్టార్ట్-అప్ నైపుణ్యాలను పెంపొందించడానికి అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ సాధనాలను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలని ఆమె అన్నారు. 



ఈ కార్యక్రమంలో  గౌరవ అతిథిగా పాల్గొన్న  కిట్స్ గర్వించదగిన పూర్వ విద్యార్థి మరియు రీసెర్చ్ సెంటర్ ఇమారత్, హైదరాబాద్ DRDO, సైంటిస్ట్-F, యస్. గోపీకృష్ణ మాట్లాడుతూ  విద్యార్థులు తమ ఆత్మగౌరవాన్ని సాధించడానికి సానుకూలత, విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను కలిగి ఉండాలన్నారు.

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) అప్లికేషన్‌లు మానవ జీవితంలోని ప్రతి అంశంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని,  అందువల్ల, ఇది ఇంజనీరింగ్, హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ రంగాలలోని ప్రధాన రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు.  

 విద్యార్థులు ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు. డై యాటిట్యూడ్ అని ఎప్పుడూ చెప్పకండి. జీవిత విజయానికి పనులు చేయడం చాలా అవసరం. కిట్స్ డబ్ల్యు తో నాకు బలమైన భావోద్వేగ బంధం మరియు మంచి అనుబంధం ఉంది. ఇంటర్నెట్ ద్వారా  సమాచారం అర చేతి లో అందుబాటులో ఉంటుంది. ఇది ప్రస్తుత విద్యార్థి లోకానికి అధ్భుతంగా ఉపయోపడుతుందని అన్నారు. 



కిట్స్ వరంగల్  గవర్నింగ్ బాడీ సభ్యులు  మరియు రిటైర్డ్ జిల్లా జడ్జి కె. దేవీప్రసాద్  అధ్యక్షోపన్యాసం చేశారు.   సంపోజియం సరికొత్త సాంకేతికతలను పంచుకోవడానికి అట్లాగే నేర్చుకోవడానికి ఉమ్మడి జాతీయ వేదికని, దీని ముఖ్య ఉద్దేశం ఇన్నోవేషన్ కోసం అన్వేషణ అని అన్నారు.  ఆలోచన చిన్నది కాదని, ప్రతి ఆలోచన వినూత్నమైందని. సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బృందానికి నాయకత్వం వహించాలని విద్యార్థులకు  సూచించారు.

  


ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ సమ్ శోధిని'23" యొక్క థీమ్ "నెక్సస్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇగ్నైటింగ్ మైండ్స్" అని పేర్కొన్నారు.    సమ్ శోధిని ముఖ్య ఉద్దేశం ఇన్నోవేషన్ కోసం అన్వేషణ అని  తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్,కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ నెట్వర్క్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తో కూడిన 9 ఇంజనీరింగ్ విభాగాలు మరియు యం బి ఎ వారు వివిధ సాంకేతకపరమైన వర్క్‌షాప్ లు నిర్వహిస్తారని తెలిపారు..  సమ్ శోధిని ఫెస్ట్ సందర్భంగా పేపర్ ప్రెజెంటేషన్‌లు అన్ని శాఖలకు సాధారణ కార్యకలాపం గాను, కాష్ ప్రైజ్ లు కూడా ఉంటాయి.  అంతే కాకుండా ప్రాజెక్ట్ ఎక్స్‌పో,  రియల్ స్తిక్, ట్రెజర్ హంట్, 50 కిపై చిలుకు సాంకేతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని  ఆయన తెలిపారు. ఇందులో 3500 కు పైగా విద్యార్థినీ విద్యార్థులు లోకల్ వారు మరియు వేయి కి పై చిలుకు ఇతర కళాశాల ల నుండి  పాల్గొన్నారని  తెలిపారు.



ఈ సందర్భంగా ఫెస్ట్ కన్వీనర్ మరియు డీన్ విద్యార్థి వ్యవహారాల ప్రొఫెసర్ వి.శంకర్ మాట్లాడుతూ మొత్తం 3500 మంది పాల్గొన్నారని, ఇందులో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి 1500 మంది పాల్గొన్నారని తెలిపారు.  లైబ్రరీలో వెసులుబాటు కల్పించిన సంవత్సరానికి 45 లక్షల రీసెర్చ్ జర్నల్‌ల కాపీలను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు తమ జ్ఞానాన్ని అప్‌డేట్ చేసుకుంటారని  తెలిపారు. 

 


ఈ  కార్యక్రమంలో   పాలకమండలి సభ్యులు ఇ.వెంకట్రామ్ రెడ్డి,  కిట్స్ డబ్ల్యు  అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యులు, డా.వి. పవన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, ఫెస్ట్ కన్వీనర్ మరియు డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ ప్రొఫెసర్ వి. శంకర్, అసోసియేట్ డీన్,  ప్రోగ్రామ్ కో-కన్వీనర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. నరసింహారావు, హెడ్, ఫిజికల్ సైన్సెస్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ,  డా.డి. ప్రభాకరా చారి, ఐ యస్ టి ఈ కిట్స్ చాప్టర్ ఛైర్మన్ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డాక్టర్ హెచ్. రమేష్ బాబు, కో-కోఆర్డినేటర్స్, ఐటిడి, హెడ్ డా. టి. సెంథిల్ మురుగన్, డా. బి. విజయ్ కుమార్, డీన్‌లు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, ఐయస్ టిఈ కిట్స్ విద్యార్థి చాప్టర్  ప్రెసిడెంట్ కె మణి జయంత్, టెక్నికల్ క్లబ్ విద్యార్థి ప్రధాన కార్యదర్శి  బి. బద్రి నారాయణ, పాల్గొన్నారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు