తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన భారత్ రాష్ట్ర సమితి జనరల్ బాడి సమావేశంలో సిఎం కెసిఆర్ కొందరు ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. దళిత భందు పథకంలో డబ్బులు దడుకున్న భాపతు ఎమ్మెల్యేలకు గతంలోనే కెసిఆర్ హెచ్చరిక చేసారు. అయినా తీరు మారని ఎమ్మెల్యేలకు ఫైనల్ గా ఈ రోజు వార్నింగ్ ఇచ్చారు.
కొందరు ఎమ్మెల్యేల పద్దతి సరిగా లేదు..దళిత భందు పథకంలో మూడు లక్షల వరకు వసూలు చేశారు....వారి చిట్టా అంతా నాదగ్గరుంది. వారు పద్దతి మార్చుకోవాలి...మళ్లీ రిపీట్ అయితే టికెట్ కూడ దక్కదు. పార్టు నుండి కూడ సస్పెండ్ చేస్తాం... అంటూ కెసిఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు కాక పోయినా తమ అుచరులు డబ్బులు వసూలు చేసినా ఎమ్మెల్యేలదే బాద్యతన్నారు.
స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ టి రాజ్య, ఎ్మమెల్సి కడియం శ్రీహరి ఇద్దరూ తరుచూ గొడవలతో రచ్చకెక్కడం సరికాదని వ్యక్తి గత ప్రతిష్టకు వెళ్లకుండా పార్టీ కోసం పనిచేయాలని సిెం కెసిఆర్ సూచించారు.
ఎన్నికలలో పార్టి అనుసరించ నున్న వ్యూహాన్ని కెసిఆర్ నేతలకు వివరించారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ పంథాలో సాధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ పార్లమెంటరీ పంథాలో దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రావడమే బిఆర్ఎస్ ముందున్న లక్ష్యమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలైన పథకాలు దేశంలో ఎక్కడా అమలు కాలేదన్నారు. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో విజయ వంతం అయిన పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు.
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులందరిని ఆదుకుంటామన్నారు. రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని మక్కలు, జొన్నలు మార్క్ ఫెడ్ ద్వారా ఖరీదు చేసే విదంగా ఆదేశాలు ఇస్తామన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box