ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బారతీయ జనతా పార్టి అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధించింది భారి ఆధిక్యతతో సీటి నిలుపుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు కేవలం 19,352 ఓట్లు వచ్చాయి. ఆత్మకూరు ఫలితంపై సిఎం వై.ఎస్ జగన్ ట్వీట్ చేసాడు.
ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా... ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి... ప్రతి అవ్వకు, ప్రతి తాతకు... పేరుపేరునా ధన్యవాదాలు! మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష అని అన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box