అదిరిన తలైవి ట్రైలర్ - పాత్రలో ఒదిగిన కంగనా రనౌత్

  తమిళనాట నిండు చట్ట సభలో దుశ్శాన పర్వం

    ఏప్రిల్ 23 న విడుదల కానున్న తలైవి 




తమిళనాడు రాష్ట్రంలో  నటిగా, రాజకీయ నేతగా అందరి హృదయాల్లో నిలిచి పోయిన మాజి ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ట్రైలర్ బుదవారం ఆమె పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.  కంగనారనౌత్ నటిస్తున్న   బయో పిక్ తలైవి  ట్రైలర్ అదర గొట్టింది. ట్రైలర్ చూసి ఈ మవీపై భారి అంచనాలు వేస్తున్నారు. సినిమా బాగా హిట్ అవుతుందని బావిస్తున్నారు.  ఏప్రిల్ 23 వ తేదీన ఈ సినిమా విడుదల చేయనున్నారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా  కంగనా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యింది.

ఏఎల్ విజయ్ దర్శకత్వం రూపు దిద్దు కున్న ఈ చిత్రంలో అనేక భావోద్వేగ సన్ని వేశాలు ఉన్నాయి. వాస్తవంగా జయ లలిత రాజకీయ జీవితానికి సంభందించి అనేక ఘట్టాలు భావోద్వేగంతో ముడి పడి ఉన్నాయి. నిండు  శాసన సభలో ఆమె జరిగిన దుశ్శాసన పర్వం ఆమె జీవితంలో అత్యంత విషాద కరమైన సంఘటన. అయితే ఈ సంఘటనే ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. నిండు చట్ట సభలో జయలలిత చీర లాగిన అత్యంత దారుణ సంఘటన  అనంతరం తమిళనాడులో జయలలిత పట్ల ఎన లేని సానుభూతి  పెరిగి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. ట్రైలర్ లో ఈ సంఘటన దృష్టం లో కంగనా రనౌత్ డెప్పిన డైలాగులు ప్రేక్షకుల మనస్సుల్లో దూసుకు పోయాయి. జయ లిలిత పాత్రలో కంగనా రనౌత్ బాగా ఒదిగి పోయారని అప్పుడే టాక్ వచ్చింది.




తలైవి ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు. అరవిందస్వామి ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత తన రోమాలు నిక్క బొడుచు కున్నాయని  సమంత అక్కినేని ట్వీట్ చేసారు. ఎప్పుడుడెప్పుడు ఈ సినిమా ధియేటర్ లో చూస్తానా అని కుతూహలంగా ఉందని అన్నారు.

విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్న తలైవి చిత్రంలో కంగన రనౌత్, అరవింద్ స్వామి తో పాటుగా ఇతర పాత్రల్లో  నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాల, జిషుసేన్ గుప్తా, పూర్ణ తదితరులు నటిస్తున్నారు. 

Thalaivi



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు