కరోనా పాజిటివ్ వచ్చినా షూటింగ్ కు వెళ్లిన నటి - పోలీసు కేసు నమోదు


కరోనా సోకిన నటి నిభందనలు ఉల్లంఘించినందుకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ర్ట వ్యాప్తంగా  కరోనాకేసులు విజృంభించాయి.  బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. అయితే ఆమె హం క్వారెంటైన్ లో ఉండకుండా షూటింగ్ కోసం వెళ్ళింది. దాంతో పోలీసులు సీరియస్ అయ్యారు. కరోనా ప్రబలుతున్న కారణంగా ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని  పోలీసులు పదే పదే చెబుతున్నారు.  ఇంట్లో హోం క్వారెంటైన్ లో ఉండి ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాల్సిన నటి షూటింగ్ కు వెళ్లడం రూల్స్ అతిక్రమించడమేనని పోలీసులు పేర్కొన్నారు. నిభందనలు పాటించనందుకు నటి గౌహర్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.  విషయాలు బయటికి పొక్కకుండా నటి చాల జాగ్రత్త పడే ప్రయత్నాలు చేసినా మీడియా వెలుగు లోకి తెచ్చింది. ముంబై పోలీసులు కూడ ఈ విషయం గోప్యంగా ఉండేకంటే మరొకరు ఇలా చేయకుండా ఉండేందుకు ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

గౌహర్ ఖాన్ ఇంట్లే లేరనేవిషయం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లి తనికి చేసి మరి తెల్సుకున్నారు. కరోనా పాజిట్ అయినా షూటింగ్ వెళ్లిందని నిర్దారించుకుని ఆనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు