మొదటి రోజే యూనిఫాంలు.. విద్యార్థులకు అందజేయనున్న ప్రభుత్వం


 మొదటి రోజే యూనిఫాంలు..

విద్యార్థులకు అందజేయనున్న ప్రభుత్వం

దేశంలో కొత్త ఒరవడికి రేవంత్ సర్కార్ శ్రీకారం, 

కుట్టు కూలీ జతకు 50 రూపాయల నుండి 75 రూపాయలకు పెంచిన రేవంత్  సర్కార్.

మహిళా సంఘాలకు స్టిచింగ్ బాధ్యతలు 

గడువు లోపు పనులు పూర్తయ్యేలా మంత్రి సీతక్క చొరవ

విజయవంతమైన ప్రభుత్వ ప్రణాళిక.

ఈరోజు ముఖ్య మంత్రి కు కలసి మహిళ సంఘాల తరుపున ధన్యవాదములు తెలిపిన సీతక్క.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు సిద్ధమయ్యాయి. యూనిఫాం స్టిచింగ్ పనులను దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించగా, స్టిచింగ్ పనులు ముగింపు దశకు వచ్చాయి. దీంతో పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాంలు అందనున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థులకు యూనిఫాంలు నేడు అందజేయనున్నారు. 

గతంలో స్టిచ్చింగ్ పనులను పరిమిత సంఖ్యలో టైలర్లకు అప్పగించడం వల్ల, యూనిఫాంలు ఆలస్యమయ్యేవి. పాఠశాల ప్రారంభమైన మూడు నాలుగు నెలల వరకు విద్యార్థులకు యూనిఫాంలు అందకపోయేవి. ఈ సమస్యను గుర్తించిన రేవంత్ రెడ్డి గారి  ప్రభుత్వం, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్ పనులను అప్పగించింది. దీంతో పాటు 50 రూపాయలున్న కుట్టు కూలీని 75 రూపాయలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో మహిళా సంఘాలు యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులను సవాలుగా తీసుకోని, సకాలంలో పూర్తి చేయగలిగాయి.

రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘ సభ్యులు ఉండగా 18000 విలేజ్ ఆర్గనై షన్లు ఉన్నాయి. వారికి 15, 30,603 (ఒక జత) యూనిఫామ్ లు కుట్టాలని ప్రభుత్వం ఆదేశించగా, ఇప్పటివరకు 90% యూనిఫాంలు పూర్తయ్యాయి. మహిళా సంఘాలు సహాయకులుగా ఈ పనిని చేసినందుకు ప్రభుత్వం తరుపున అభినందనలు తెలుపుతున్నాం. దానికి సుమారు Rs.50 Crores స్టిచ్చిoగ్ ఆదాయం, ప్రతి  సoవత్సరం  సమకూరుతుంది.

అయితే మహిళా సంఘాలకు స్టిచింగ్ పనులను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పగించిన నాటి నుంచి, సకాలంలో స్టిచింగ్ పనులు పూర్తయ్యేలా పంచాయతీరాజ్, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రణాళిక బద్దంగా వ్యవహరించారు. ఎప్పటికప్పుడు అధికారులను, మహిళా సంఘాలను సమన్వయపరుస్తూ గడువు లోగా పాఠశాలకు యూనిఫాంలో చేరేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మొదటి రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టయింది. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ పనులను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారెకి, సకాలంలో పనులు పూర్తి చేసేలా వ్యవహరించిన మహిళా సంఘాలు, ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమీషనర్, పిర్ అండ్ ర్ఇ, సీఈఓ సర్ప్, కల్లెక్టర్స్, సర్ప్ అధికారులకు, డిర్ డిఒ, అడిషనల్ డిర్ డిఒ, డిపిఓ’s ఏపిమ్’s, సిసి’s మరియు ఇతర  అధికారులను మంత్రి సీతక్క అభినందించారు.

భవిష్యత్ లో కూడా మహిళ సంక్షేమా కార్యక్రమాలు ద్వార,  ఇంక ఆదాయం పరమైన పనులు అప్పగించడం జరుగుతుంది.  దానితో పాటు రెండవ జత, వారికి అందజేయడానికి సందిద్దంగా ఉన్నారు.  ముందు రోజులలో ఇతర ప్రభుత్వ స్టిచింగ్ పని కూడా SHG’s లకు మా ద్వార జరుగుతుంది


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు