కిట్స్ వరంగల్ లో నిర్వహించిన " క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-క్వెస్ట్-2024” ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం ముగిసింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ (PS), కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ మరియు సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (సిటి యల్),నిట్ వరంగల్ (PMMMNMTT పథకం విద్యా మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారు.) ఇందులో బాగంగా “క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-క్వెస్ట్-2024” పై వారం రోజుల పాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను 2024 మే 20 నుండి 24 వరకు కిట్స్ వరంగల్ క్యాంపస్లో నిర్వహించారు.
ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిట్ వరంగల్ ఈ సి ఈ విభాగపు ప్రొఫెసర్ & అధిపతి, సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (సిటి యల్), ప్రొఫెసర్ టి. కిషోర్ కుమార్ పాల్గొన్నారు.,
ఎఫ్డిపి ప్రధాన లక్ష్యం నెరవేరి విజయవంతమైన సాంకేతిక వేదికగా రూపుదిద్దుకుందన్నారు. ప్రస్తుత స్మార్ట్ మరియు డిజిటల్ టెక్నాలజీలు కంప్యూటర్, ల్యాప్టాప్ మరియు మొబైల్లతో సహా క్వాంటం మెకానిక్స్ సూత్రాల ఆధారంగా రూపొందించబడి అభివృద్ధి చేయబడ్డాయని అన్నారు. ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు క్వాంటం ఎనేబుల్డ్ సైన్స్ & టెక్నాలజీని నేర్చుకోవాలన్నారు. ఎఫ్డిపి పార్టిసిపెంట్లు నైపుణ్యం పెంపు కోసం చాలా నిబద్ధత మరియు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. టెక్నాలజీని బోధించడం మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని ఉపాధ్యాయులు తప్పనిసరిగా కొనసాగించాలి. నూతన సాంకేతిక ఒరవడి నీ సృష్టించే మెళకువలను సూచించారు.
సన్ స్క్రీన్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రోకెమికల్ సెన్సార్లు, బయోసెన్సర్లు, క్వాంటం డాట్స్, క్వాంటం కంప్యూటింగ్, సోలార్ సెల్స్ మరియు థిన్ ఫిల్మ్లు వంటి నానో మెటీరియల్స్ అప్లికేషన్లు ప్రస్తుత ఇంజినీరింగ్ మరియు టెక్నాలజికల్ డొమైన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు.
ప్రిన్సిపల్ ప్రొ.కె.అశోక రెడ్డి వాలెడిక్టరీ కార్యక్రమం అధ్యక్షోపన్యాసం ఇచ్చారు. క్వాంటం ఎనేబుల్డ్ టెక్నాలజీస్లో ఉన్న వినూత్న నైపుణ్యాలను పంచుకోవడానికి మరియు నేర్చుకోవడానికి ఇది సాంకేతిక వేదికన్నారు. విద్యావేత్తల నైపుణ్యాలకు విలువలు జోడింపు అనే నినాదం, చివరికి విద్యార్థి సంఘం చివరి లబ్ధిదారు అని ప్రిన్సిపాల్ తెలిపారు. క్వాంటం ఎనేబుల్డ్ టెక్నాలజీలకు సంబంధించిన నైపుణ్యాలను సులభతరం చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సాంకేతికతలతో పాల్గొన్నవారిని సన్నద్ధం చేయడానికి యఫ్ డి పి రూపొందించారని తెలిపారు. ఇందులో పాల్గొన్నవారు నేర్చుకున్న నైపుణ్యాలు మరియు సాంకేతికతను పరిశోధనలో మరియు తరగతి గదిలో విద్యార్థుల కోసం అమలు చేయాలని అన్నారు..
ఈ సందర్భంగా రాజ్యసభ మాజి సభ్ఎంయులు కిట్స్ వరంగల్ ఛైర్మన్ కెప్టెన్ వి. ల క్ష్మికాంతా రావు, ల్ కోశాధికారి పి.నారాయణరెడ్డి, అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అధ్యాపక బృందంను అభినందించారు .
ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ రిజిస్ట్రార్,ఎం. కోమల్ రెడ్డి, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి & అసోసియేట్ ప్రొఫెసర్ డా. డి. ప్రభాకరా చారి, కోఆర్డినేటర్లు, డా. Ch. సతీష్ చంద్ర (భౌతికశాస్త్రంలో అసోసియేట్ ప్రొఫెసర్) & డాక్టర్ బంటీ రాయ్ (భౌతికశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్), కో-కోఆర్డినేటర్, డా. కుచన శ్రీనివాస్, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ డాక్టర్ డా. గ్రేస్ శాంతి, ఫిజికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ డా. టి. మధుకర్ రెడ్డి డా. హెచ్. రమేష్ బాబు, డా. ఎన్. మారాము, డా. కె. రాజేంద్ర ప్రసాద్ డా. వి. ప్రశాంత్ కుమార్ డా. పి. శ్రీనివాసరావు డా. డి. మాధవి లత డా. ఎ. ఎన్. మల్లిక డా. ఎం. రణధీర్ కుమార్ మరియు డా. ఎం. గోపి కృష్ణ, డా. ఇ. . కళ్యాణ్ రావు, డాక్టర్ జి. శ్రీధర్, డాక్టర్ డి ప్రవీణ, డాక్టర్ వి సునీల్ కుమార్ మరియు అధ్యాపకులు మరియు సిబ్బంది అందరూ పాల్గొన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box