ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనమని అఖిలభారత పద్మశాలి మహాసభలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కెసీఆర్ ఆయన్ను ఖతం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా నన్నారు.
ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ విధానమని అన్నారు.
కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమేకాదు… దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని అంతే కాక ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని సీఎం వేదికపై ప్రకటించారు.
ఇందుకు సంభందించిన ఆ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారికి అప్పగిస్తున్నానని తెలిపారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే 600 కోట్ల విలువైన 1కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నామని తెలిపారు.
మీరు అడిగింది ఇవ్వడమే నా కర్తవ్యం అని తనను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప తనకు మరో ఆలోచన లేదని స్పష్టం చేసారు.
అభిమానంతో నన్ను మీ గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటా నని అన్నారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చా మని ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పని మాట్లాడుతున్నారని కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పు అని మాట్లాడుతున్నాయని విమర్శించారు.
బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోందని దుయ్య బట్టారు.
"కెసిఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే… నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమే... బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోందని ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలని" పిలుపు నిచ్చారు.
ఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఇక్కడి పద్మశాలీలు కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
కోటి రూపాయలతో షోలాపూర్ లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తామన్నారు.
ఆర్ధిక, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా ఈ ప్రభుత్వం పద్మ శాలీలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పద్మశాలీల శ్రేయస్సు కేపీషం క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ సోదరుడిగా అండగా ఉంటానని ఈ వేదికగా హామీ ఇస్తున్న అని సీఎం అన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పద్మశాలి మహాసభ
ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అఖిలభారత పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box